దూకుడు దేశానికి దూరంగా ఉండాలని దుబాయి సంచలన నిర్ణయం
- October 13, 2017
దుబాయి : దూకుడు దేశానికి దూరంగా ఉండాలని దుబాయ్ నిర్ణయించుకొంది. ఈ మేరకు ఉత్తర కొరియా ప్రభుత్వానికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఊహించని దెబ్బ కొట్టింది. ఉత్తర కొరియన్లకు ఇకపై వీసా సర్వీసులు అందించబోమని తేల్చిచెప్పింది. ఉత్తర కొరియాతో సంబంధాల విషయమై దుబాయి ప్రభుత్వం గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఉత్తర కొరియాకు తన రాయబారిని రద్దు చేసుకుంది. ఉత్తర కొరియా పౌరులకు వీసాలు, కంపెనీ వీసాలను ఇకపై ఇవ్వబోమని తెలిపింది. ఉత్తర కొరియా చేస్తున్న అణ్వాయుధ పరీక్షలకు వ్యతిరేకంగానే తాము ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు దుబాయి ప్రభుత్వం ప్రకటించింది. అంతర్జాతీయ భద్రతను దృష్టిలో పెట్టకుని తమ వంతు బాధ్యతగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు దుబాయ్ తెలిపింది. ఈ నిర్ణయాన్ని తాము కూడా అనుసరిస్తున్నట్లు గల్ఫ్ దేశాలయిన కువైట్, ఖతర్ సైతం తేల్చిచెప్పాయి. ఇప్పటికే యూఏఈలో దాదాపు 1300 మంది ఉత్తర కొరియన్లు జీవనోపాధి పొందుతున్నారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









