డెహ్రాడూన్లో నల్గొండ విద్యార్థి మృతి
- October 13, 2017
నల్లగొండ జిల్లా విద్యార్థి డెహ్రాడూన్లో గంగోత్రి నదిలో మునిగి మృతి చెందాడు. మిర్యాలగూడ హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన నరహరి అనే విద్యార్థి నదీ స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తూ మునిగి చనిపోయాడు. ఈ ఘటనలో మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. స్నేహితుడి పుట్టినరోజు సందర్భంగా గురువారం నరహరి ఫ్రెండ్స్తో కలిసి ఉత్తరకాశీలోని గంగోత్రి టూర్కి వెళ్లాడు. దైవదర్శనానికి ముందు నదిలో స్నానం చేయడానికి వెళ్లి తిరిగిరాని లోకాలకు చేరాడు.
నరహరి డెహ్రాడూన్లోని DSB యూనివర్సిటీలో అగ్రికల్చర్ BSC ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. మిత్రులతో కలిసి గంగోత్రి నదిలో దిగిన నరహరి ఈత కొడుతూ ప్రవాహంలో కొట్టుకుపోయాడు. బండరాళ్ల మధ్య చిక్కుకుపోయి మృతి చెందాడు. మరో విద్యార్థి కాలు విరిగి తీవ్రంగా గాయపడ్డాడు. మృతుడి స్వస్థలం సూర్యాపేట. చదువు పూర్తవగానే.. మంచి ఉద్యోగంలో స్థిరపడి కుటుంబానికి అండగా ఉంటాడని, కష్టాలు తీరుస్తాడని అనుకున్న తల్లిదండ్రులు నరహరి మృతితో కుప్పకూలిపోయారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







