డెహ్రాడూన్‌లో నల్గొండ విద్యార్థి మృతి

- October 13, 2017 , by Maagulf
డెహ్రాడూన్‌లో నల్గొండ విద్యార్థి మృతి

నల్లగొండ జిల్లా విద్యార్థి డెహ్రాడూన్‌లో గంగోత్రి నదిలో మునిగి మృతి చెందాడు. మిర్యాలగూడ హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన నరహరి అనే విద్యార్థి నదీ స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తూ మునిగి చనిపోయాడు. ఈ ఘటనలో మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. స్నేహితుడి పుట్టినరోజు సందర్భంగా గురువారం నరహరి ఫ్రెండ్స్‌తో కలిసి  ఉత్తరకాశీలోని గంగోత్రి టూర్‌కి వెళ్లాడు. దైవదర్శనానికి ముందు నదిలో స్నానం చేయడానికి వెళ్లి తిరిగిరాని లోకాలకు చేరాడు. 

నరహరి డెహ్రాడూన్‌లోని DSB యూనివర్సిటీలో అగ్రికల్చర్ BSC ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. మిత్రులతో కలిసి గంగోత్రి నదిలో దిగిన నరహరి ఈత కొడుతూ ప్రవాహంలో కొట్టుకుపోయాడు. బండరాళ్ల మధ్య చిక్కుకుపోయి మృతి చెందాడు. మరో విద్యార్థి కాలు విరిగి తీవ్రంగా గాయపడ్డాడు. మృతుడి స్వస్థలం సూర్యాపేట. చదువు పూర్తవగానే.. మంచి ఉద్యోగంలో స్థిరపడి కుటుంబానికి అండగా ఉంటాడని, కష్టాలు తీరుస్తాడని అనుకున్న తల్లిదండ్రులు నరహరి మృతితో కుప్పకూలిపోయారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com