నవంబర్లో హైదరాబాద్కు రానున్న ఇవాంక ట్రంప్.!
- October 14, 2017
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూతురు ఇవాంక నవంబర్లో హైదరాబాద్కు రానుంది నగరంలో రెండురోజులపాటు ఆమె స్టే చేయనున్నారు. దీంతో ఆమె ఎక్కడ బస చేస్తారనే రకరకాల ఊహాగానాలు. తొలుత తాజ్ ఫలక్నుమాలో వుంటారని వార్తలు పెద్ద ఎత్తున హంగామా చేశాయి. ఐతే, డెలిగేట్స్ ఎక్కడ బస చేస్తారనే దానిపై తెలంగాణ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చేసింది. మాదాపూర్లోని రహేజా ఐటీ పార్కులోగల వెస్టిన్ హైదరాబాద్ మైండ్స్పేస్ హోటల్లో తన సిబ్బందితో కలిసి ఇవాంక ట్రంప్ వుంటారని ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ తెలిపారు. నవంబర్ 28, 29న హైదరాబాద్లో అంతర్జాతీయ పారిశ్రామిక సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు ప్రధాని నరేంద్రమోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూతురు ఇవాంకతో పాటు ప్రపంచవ్యాప్తంగా వున్న పారిశ్రామికవేత్తలు హాజరుకానున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇందుకోసం 8 కోట్ల రూపాయలతో ఏర్పాట్లు చేస్తోంది.
తాజా వార్తలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!







