పాఠశాలలో కాల్పులు, ఏడుగురు మృతి

- October 14, 2017 , by Maagulf
పాఠశాలలో కాల్పులు, ఏడుగురు మృతి

కెన్యాలోని ఒక పాఠశాలలో దుండగులు జరిపిన కాల్పుల్లో ఆరుగురు విద్యార్థులతో సహా ఏడుగురు మరణించారు. కెన్యా సరిహద్దుల్లో ఉన్న లోకిచొగియో మిక్స్‌డ్‌ సెకండరీ స్కూల్‌లో సాయుధులైన కొందరు దుండగులు ప్రవేశించి పాఠశాల ప్రిన్సిపాల్‌, సస్పెండైన ఒక విద్యార్థి కోసం చూశారని, వారు కనిపించకపోవడంతో ఇష్టం వచ్చినట్లు కాల్పులు జరిపారని పోలీసులు చెప్పారు. కాల్పులు జరిపిన వారిలో అదే పాఠశాలకు చెందిన సీనియర్‌ విద్యార్థి ఒకరు ప్రధాన అనుమానితుడని రిఫ్ట్‌ వ్యాలీ ప్రాంతీయ నేర పరిశోధనా సంస్థ అధిపతి గిడియాన్‌ కిబుంజా చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com