రెండింతలు పెరిగిన పసిడి దిగుమతులు

- October 15, 2017 , by Maagulf
రెండింతలు పెరిగిన పసిడి దిగుమతులు

న్యూదిల్లీ: 2017-18 ఆర్థిక సంవత్సరం తొలి ఆరు మాసాల్లో బంగారం దిగుమతులు రెండింతలు పెరగడం ద్వారా 16.95 బిలియన్‌ డాలర్లకు చేరినట్లు వాణిజ్య మంత్రిత్వశాఖ గణాంకాల ద్వారా వెల్లడైంది. బంగారం దిగుమతులు దేశ కరెంటు ఖాతాలోటుకు దారితీస్తున్నాయి. 2016-17 ఏప్రిల్‌-సెప్టెంబర్‌ మధ్యకాలంలో దిగుమతుల విలువ 6.88 బిలియన్‌ డాలర్లుగా ఉంది. గతేడాది సెప్టెంబర్‌ మాసంతో పోలిస్తే ముగిసిన నెలలో పసిడి దిగుమతులు 5శాతం మేర తగ్గడం ద్వారా 1.80 బిలియన్‌ డాలర్ల నుంచి 1.71బిలియన్‌ డాలర్లకు తగ్గాయి. దీంతో దేశీయ కరెంటు ఖాతా లోటు ఏడు నెలల కనిష్ఠానికి పడిపోయింది. అయితే ప్రస్తుత పండుగ సీజన్‌లో బంగారం దిగుమతులు మరింత పెరిగే అవకాశం ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com