రెండింతలు పెరిగిన పసిడి దిగుమతులు
- October 15, 2017
న్యూదిల్లీ: 2017-18 ఆర్థిక సంవత్సరం తొలి ఆరు మాసాల్లో బంగారం దిగుమతులు రెండింతలు పెరగడం ద్వారా 16.95 బిలియన్ డాలర్లకు చేరినట్లు వాణిజ్య మంత్రిత్వశాఖ గణాంకాల ద్వారా వెల్లడైంది. బంగారం దిగుమతులు దేశ కరెంటు ఖాతాలోటుకు దారితీస్తున్నాయి. 2016-17 ఏప్రిల్-సెప్టెంబర్ మధ్యకాలంలో దిగుమతుల విలువ 6.88 బిలియన్ డాలర్లుగా ఉంది. గతేడాది సెప్టెంబర్ మాసంతో పోలిస్తే ముగిసిన నెలలో పసిడి దిగుమతులు 5శాతం మేర తగ్గడం ద్వారా 1.80 బిలియన్ డాలర్ల నుంచి 1.71బిలియన్ డాలర్లకు తగ్గాయి. దీంతో దేశీయ కరెంటు ఖాతా లోటు ఏడు నెలల కనిష్ఠానికి పడిపోయింది. అయితే ప్రస్తుత పండుగ సీజన్లో బంగారం దిగుమతులు మరింత పెరిగే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!







