విశాఖలో ఐఎన్ఎస్ కిల్టన్ జాతికి అంకితం
- October 16, 2017
దేశీయ పరిజ్ఞానంతో నిర్మించిన యాంటీ సబ్మెరైన్ వార్ షిప్ ఐఎన్ఎస్ కిల్టన్ను రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ జాతికి అంకితం చేశారు. సోమవారం ఉదయం ఆమె విశాఖలోని తూర్పు నౌకాదళ స్థావరానికి చేరుకున్నారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఆమె ఐఎన్ఎస్ కిల్టన్ను జాతికి అంకితం చేశారు. ఈ కార్యక్రమంలో నావికాదళ చీఫ్ అడ్మిరల్ సునీల్ లంబ, తూర్పు నావికా దళాధిపతి హెచ్సీఎస్ బిస్త్ పాల్గొన్నారు.
ఐఎన్ఎస్ కిల్టన్ను కార్బన్ ఫైబర్, మిశ్రమ లోహాలతో తయారు చేశారు. దీంతో ఈ కార్వెట్ ప్రయాణాన్ని శత్రుదేశ నిఘా వ్యవస్థలు గుర్తించలేవు. 'ప్రాజెక్ట్ 28' కింద నిర్మిస్తున్న నాలుగు కార్వెట్లలో ఇది మూడోది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!







