వలస కార్మికుల సమస్యలపై యూఏఈతో కలిసి పనిచేస్తున్న ఇండియా
- October 17, 2017
యూఏఈలో రకరకాల సమస్యలతో ఇబ్బందులు పడుతున్న భారతీయులకు సంబంధించి ఇండియన్ ఫారిన్ మినిస్ట్రీ, యూఏఈతో కలిసి ఎప్పటికప్పుడు మంతనాలు జరుపుతూ, ఆయా వ్యక్తులను సమస్యల నుంచి గట్టెక్కిస్తోందని యూఏఈలో ఇండియన్ అంబాసిడర్ నవదీప సూరి చెప్పారు. డొమెస్టిక్ వర్కర్స్ కోసం షెల్టర్ ఏర్పాటు చేశామనీ, ముఖ్యంగా మహిళలకు సంబంధించి ప్రత్యేక చర్యలు చేపడ్తున్నామని ఆయన తెలిపారు. యూఏఈ చట్టాలపై అవగాహన లేక సమస్యలు కొనితెచ్చుకుంటున్నవారికి అవగాహన కల్పిస్తున్నామని వివరించారాయన. వరల్డ్ స్కిల్ కాంపిటీషన్లో ఇండియా పెవిలియన్ని అంబాసిడర్ సూరి ప్రారంభించారు. 77 మంది సభ్యులుగల స్ట్రాంగ్ కంటిగ్నెంట్ బృందాన్ని దీనికోసం ఏర్పాటు చేసింది. 2009లో ఇండియా సిల్వర్ మెడల్స్ని సాధించింది. 2015లో 5 మెడలియన్స్ ఆఫ్ ఎక్స్లెన్స్ని సాధించింది. ఇటీవలి కాలంలో తమ పెర్ఫామెన్స్ బాగా పెరగిందనీ, గోల్డ్ సాధించే అవకాశాలు మెరుగుపర్చుకున్నిమని సూరి పేర్కొన్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







