ఐదు వాయిదాల్లో రుణమాఫీ
- October 18, 2017
ఏపీలో మూడో విడత రుణమాఫీ మొదలైంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని రైతుల అప్పులు చెల్లిస్తోంది. అర్హులైన ప్రతి రైతుకు అందజేస్తామని.. రుణమాఫీ అమలు కమిటీ చైర్మన్ కుటుంబరావు అన్నారు. తమకు మాఫీ అందడం లేదంటూ ఫిర్యాదులు పెరుగుతుండడంపై ఆయన స్పందించారు.
రుణమాఫీ అందడానికి అర్హత పత్రం కీలకమన్నారు.. కుటుంబరావు. తొలి విడత సందర్భంగా తమకు ఏకంగా 10 లక్షల వరకు ఫిర్యాదులు అందాయని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి చొరవతో యుద్ధ ప్రాతిపదికన క్లియర్ చేశామని చెప్పారు. వాటిల్లో చాలావరకు బ్యాంకుల్లో జరిగిన పొరపాట్లే ఉన్నాయి. అప్పుడు రిజక్ట్ ఐనవాళ్లు.. మళ్లీ ఫిర్యాదులు చేస్తున్నారని అన్నారాయన.
ఏపీ ప్రభుత్వం ఐదు వాయిదాల్లో రుణమాఫీని పూర్తి చేయనుంది. అవినీతికి ఆస్కారం లేకుండా ఉండేందుకే ఆన్లైన్లో చెల్లింపులు చేస్తోంది. ఎవ్వరు, ఎప్పుడు ఫిర్యాదు చేసినా స్వీకరిస్తామన్నారు. రిజర్వ్బ్యాంక్ మార్గదర్శకాల ప్రకారమే అర్హుల ఎంపిక జరుగుతుందన్నారు. ఈ విషయంలో బ్యాంకులు కూడా రైతులకు, ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









