ఐదు వాయిదాల్లో రుణమాఫీ
- October 18, 2017
ఏపీలో మూడో విడత రుణమాఫీ మొదలైంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని రైతుల అప్పులు చెల్లిస్తోంది. అర్హులైన ప్రతి రైతుకు అందజేస్తామని.. రుణమాఫీ అమలు కమిటీ చైర్మన్ కుటుంబరావు అన్నారు. తమకు మాఫీ అందడం లేదంటూ ఫిర్యాదులు పెరుగుతుండడంపై ఆయన స్పందించారు.
రుణమాఫీ అందడానికి అర్హత పత్రం కీలకమన్నారు.. కుటుంబరావు. తొలి విడత సందర్భంగా తమకు ఏకంగా 10 లక్షల వరకు ఫిర్యాదులు అందాయని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి చొరవతో యుద్ధ ప్రాతిపదికన క్లియర్ చేశామని చెప్పారు. వాటిల్లో చాలావరకు బ్యాంకుల్లో జరిగిన పొరపాట్లే ఉన్నాయి. అప్పుడు రిజక్ట్ ఐనవాళ్లు.. మళ్లీ ఫిర్యాదులు చేస్తున్నారని అన్నారాయన.
ఏపీ ప్రభుత్వం ఐదు వాయిదాల్లో రుణమాఫీని పూర్తి చేయనుంది. అవినీతికి ఆస్కారం లేకుండా ఉండేందుకే ఆన్లైన్లో చెల్లింపులు చేస్తోంది. ఎవ్వరు, ఎప్పుడు ఫిర్యాదు చేసినా స్వీకరిస్తామన్నారు. రిజర్వ్బ్యాంక్ మార్గదర్శకాల ప్రకారమే అర్హుల ఎంపిక జరుగుతుందన్నారు. ఈ విషయంలో బ్యాంకులు కూడా రైతులకు, ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







