సైనికులతో దీపావళి జరుపుకోనున్న మోడీ
- October 19, 2017వరుసగా నాలుగో ఏడాది ప్రధానమంత్రి నరేంద్రమో డీ దీపావళి వేడుకలను సైనికులతో కలిసి జరుపుకోనున్నారు. జమ్ముకశ్మీర్లోని బందిపొర జిల్లా గురేజ్ సెక్టార్ వద్ద పహారా కాస్తున్న సైనికులను మో డీ కలుసుకొని దీపావళి వేడుకల్లో పాల్గొననున్నారు. అక్కడి నుంచి ఆయన ఉరీ సెక్టార్లో కూడా పర్యటించనున్నారు. ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్, నార్తన్ కమాండ్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ దేవ్రాజ్ అన్బు తదితరులు మో డీ వెంట ఉండనున్నారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి మో డీ దీపావళి వేడుకలను సైనికులతో కలిసే జరుపుకొంటున్నారు. 2014లో సియాచిన్లో సైనికులతో జరుపుకోగా.. 2015లో అమృత్సర్లోని డొగ్రాయ్ వార్ మెమోరియల్ను సందర్శించి అక్కడ జవాన్లతో దీపావళి వేడుకలు చేసుకున్నారు. గతేడాది మో డీ దీపావళి వేడుకలను ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్(ఐటీబీపీ) సిబ్బందితో కలిసి చేసుకున్నారు. వేడుకల్లో భాగంగా ఆయన ఉత్తరఖాండ్లోని చమోలి వెళ్లి అక్కడ ఐటీబీపీ జవాన్లను కలిశారు. వారికి మిఠాయిలు తినిపించి ఆనందంగా వేడుకలు చేసుకున్నారు.
తాజా వార్తలు
- షార్జాలో విషాదం.. లాక్ చేసిన కారులో ఏడేళ్ల చిన్నారి మృతి
- ఫుజైరాలో వైల్డ్ క్యాట్ పట్టివేత.. ఓనరుకు భారీ జరిమానా
- కువైట్ టవర్ టిక్కెట్ల ఫోర్జరీ.. ప్రవాసికి 7 ఏళ్ల జైలుశిక్ష
- టూరిజం ప్యాకేజీలను ఆవిష్కరించిన ఒమన్
- సోదరుడిని కత్తితో చంపిన యువకుడికి 15ఏళ్ల జైలుశిక్ష
- దుబాయ్ టాక్సీలో వస్తువులు మర్చిపోతే ఏం చేయాలి?
- ఐదోసారి రష్యా అధ్యక్షుడిగా పుతిన్..
- ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమాన సర్వీసులు రద్దు
- వేములవాడ ఆలయంలో ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు
- బహ్రెయిన్ స్కూళ్లల్లో ఇంగ్లిష్ లో సైన్స్, మ్యాథ్స్ బోధన