సైనికులతో దీపావళి జరుపుకోనున్న మోడీ
- October 19, 2017వరుసగా నాలుగో ఏడాది ప్రధానమంత్రి నరేంద్రమో డీ దీపావళి వేడుకలను సైనికులతో కలిసి జరుపుకోనున్నారు. జమ్ముకశ్మీర్లోని బందిపొర జిల్లా గురేజ్ సెక్టార్ వద్ద పహారా కాస్తున్న సైనికులను మో డీ కలుసుకొని దీపావళి వేడుకల్లో పాల్గొననున్నారు. అక్కడి నుంచి ఆయన ఉరీ సెక్టార్లో కూడా పర్యటించనున్నారు. ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్, నార్తన్ కమాండ్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ దేవ్రాజ్ అన్బు తదితరులు మో డీ వెంట ఉండనున్నారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి మో డీ దీపావళి వేడుకలను సైనికులతో కలిసే జరుపుకొంటున్నారు. 2014లో సియాచిన్లో సైనికులతో జరుపుకోగా.. 2015లో అమృత్సర్లోని డొగ్రాయ్ వార్ మెమోరియల్ను సందర్శించి అక్కడ జవాన్లతో దీపావళి వేడుకలు చేసుకున్నారు. గతేడాది మో డీ దీపావళి వేడుకలను ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్(ఐటీబీపీ) సిబ్బందితో కలిసి చేసుకున్నారు. వేడుకల్లో భాగంగా ఆయన ఉత్తరఖాండ్లోని చమోలి వెళ్లి అక్కడ ఐటీబీపీ జవాన్లను కలిశారు. వారికి మిఠాయిలు తినిపించి ఆనందంగా వేడుకలు చేసుకున్నారు.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు