జనవరిలో మొదలుకానున్న నాగ్-నానిల మల్టీస్టారర్.!
- October 19, 2017
నాగార్జున, నాని కలయికలో ఓ మల్టీస్టారర్ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. భలే మంచి రోజు, శమంతకమణి సినిమాలతో మెప్పించిన శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఈ మల్టీస్టారర్ తెరకెక్కనుంది. ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ నిర్మించనుంది.
ఈ మల్టీస్టారర్ కోసం అక్కినేని, నాని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం వచ్చే యేడాది జనవరి నుంచి సెట్స్ మీదకి వెళ్లనున్నట్టు సమాచారమ్. ప్రస్తుతం నాగ్ వర్మ దర్శకత్వంలో ఓ యాక్షన్ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. మరో పది రోజుల్లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. మరోవైపు, నాని 'ఎంసిఏ'తో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. ఆ తర్వాత నాగ్ - నాని ల మల్టీస్టారర్ ని సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారు.
తాజా వార్తలు
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి







