ఎన్నారై పాలసీ లాంచ్ - దుబాయ్ చేరుకున్న ప్రముఖులు

- October 20, 2017 , by Maagulf
ఎన్నారై పాలసీ లాంచ్ - దుబాయ్ చేరుకున్న ప్రముఖులు

దుబాయ్: అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఆంధ్ర ప్రభుత్వం చే రూపుదిద్దుకున్న ఒకానొక శాఖ 'ఏపీఎన్ఆర్టీ'. ప్రపంచ నలుమూలల నివసిస్తున్న ప్రవాసీయులకు చేదోడుగా నిలుస్తోంది ఈ శాఖ. ఎన్నారై లను దృష్టిలో పెట్టుకొని ఈ శాఖ రూపొందించిన పాలసీ 'ఎన్నారై పాలసీ'. దుబాయ్ లో రేపు జరగనున్న ఎన్నారై పాలసీ లోగో మరియు పాలసీ లాంచ్ కు దుబాయ్ విచ్చేసారు ఎన్నారై మంత్రి కొల్లు రవీంద్ర మరియు ఏపీఎన్ఆర్టీ ప్రెసిడెంట్ రవికుమార్ వేమూరు. వీరికి ఎయిర్పోర్ట్ లో పుష్ప గుచ్చాలతో యూఏఈ , కువైట్ , సౌదీ కో ఆర్డినేటర్లు  ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ ఎన్నారై పాలసీ ప్రతి ఎన్నారై కి ఉపయోగపడే విధంగా మలిచామని, అందరు దీనిని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com