మొబైల్ నేలకేసి కొట్టాడని ఆగ్రహించి భారతీయ వడ్రంగిని హత్య చేసిన ఓ వ్యక్తి
- October 20, 2017
దుబాయ్: ' అనవసరమైన పట్టుదలలు పంతాలు కొన్ని సందర్భాలలో ప్రాణాలు సైతం పోతాయని తెలియచెప్పే వార్త ఇది ' బతుకుతెరువు కోసం వడ్రంగి కార్మికుడిగా పనిచేసేందుకు దుబాయ్ కు వెళ్లిన ఓ భారతీయుడు విషాదకరమైన రీతిలో హత్య చేయబడ్డాడు . యూఏఈలోని దుబాయ్ నగరంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ దారుణానికి సంబంధించిన వివరాల ప్రకారం దుబాయ్ నగరంలోని దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్ సమీపంలో ఓ వ్యక్తి తన గుర్తింపుకార్డును పొగొట్టుకున్నాడు. రాత్రి సమయం కావడంతో తన సెల్ఫోన్ టార్చిలైట్ వేసి స్నేహితుల సహాయంతో గుర్తింపు కార్డును వెతకడం మొదలుపెట్టాడు. కార్డు కోసం వెతుకుతుండగా వారిపక్కనే 28 ఏళ్ల వయసున్న భారతీయ యువకుడు నిద్రిస్తున్నాడు. నీ మొబైల్ టార్చిలైట్ కాంతి నా కళ్లపై పడుతోందని, నిద్రచెడగొట్టొద్దని, లైట్ను ఆపివేయాలని కోరాడు. లైట్ ఆపివేయకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో భారతీయ యువకుడు ఆ వ్యక్తి సెల్ఫోన్ను లాక్కొని నేలకేసి కొట్టాడు. సెల్ఫోన్ పగిలిపోయింది. ఈ విషయంపై ఇరువురు మధ్య తీవ్ర వివాదం జరిగింది. సెల్ఫోన్ను కొనిస్తానని హామీ ఇవ్వడంతో అందరూ అక్కడి నుంచి వెనుదిరిగారు. కొంతదూరం నడిచిన తర్వాత ఓ ఇనుప రాడ్ను తీసుకొని వచ్చిన ఆ వ్యక్తి.. తన సెల్ఫోన్ను పగులగొట్టిన భారతీయ యువకుడిన విచక్షిణా రహితంగా కొట్టాడు. తల, గొంతుపై గాయాల కారణంగా తీవ్రరక్తస్రావమవ్వడంతో అక్కడిక్కడే భారతీయ యువకుడు మృతిచెందాడు. తెల్లవారుజామున సమచారం అందుకున్న పోలీసులు హత్య చేసిన నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తులో భాగంగా సీసీ కెమేరాలను పరిశీలించగా విషయం తేలిందని పోలీసులు కోర్టుకు తెలిపారు. జూన్ 27న జరిగిన ఈ ఘటనపై కోర్టు తుదితీర్పు వెల్లడించాల్సి ఉంది. నిందితుడి వాదన మాత్రం మరోలా ఉంది. తాను ఉద్దేశ్యపూర్వకంగా హత్య చేయలేదని అనుకోకుండా అలా జరిగిపోయిందని కోర్టులో నిందితుడు చెప్పాడు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







