అమెరికాలోని న్యూయార్క్‌లో జరిగే ఐరాస సమావేశాలకు ఎంపీ రామ్మోహన్‌

- October 21, 2017 , by Maagulf
అమెరికాలోని న్యూయార్క్‌లో జరిగే ఐరాస సమావేశాలకు ఎంపీ రామ్మోహన్‌

అమెరికాలోని న్యూయార్క్‌లో ఈ నెల 22నుంచి 28 వరకు జరగనున్న ఐక్యరాజ్యసమితి సమావేశాలకు ఎంపీ కింజరా పు రామ్మోహన్‌నాయుడు ఎంపికయ్యారు. ఈ మేరకు శుక్రవారం కేంద్రప్రభు త్వం నుంచి ఒక ప్రకటన వెలువడింది. తెలుగుదేశం పార్టీ తరఫున ఒక పార్లమెంట్‌సభ్యుడిని పంపాలని కేంద్రప్రభు త్వం కోరగా టీడీపీ అధిష్ఠానం రామ్మోహన్‌నాయుడును సిఫార్సు చేసింది. దీనికి కేంద్ర విదేశీవ్యవహారాలశాఖ ఆ మోదముద్ర వేసిం ది. గతంలో దివంగత ఎర్రంనాయుడు ఐక్యరాజ్యసమితి సమావేశాల్లో పాల్గొన్నారు. ఆయన బాటలోనే తనయుడు రామ్మోహన్‌నాయుడు ఐరాస సమావేశాలకు ఎంపిక కావడం తో టీడీపీ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు వె ల్లివిరుస్తున్నాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com