మహిళా ఉగ్రవాది కరెన్ ఐజా హమిడాన్ను విచారించేందుకు ఫిలిప్పీన్స్ను కోరిన ఎన్ఐఏ
- October 21, 2017
భారత సంతతి మహిళా ఉగ్రవాది కరెన్ ఐజా హమిడాన్ను విచారించేందుకు అనుమతించాలంటూ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఫిలిప్పీన్స్ ప్రభుత్వాన్ని కోరింది. యువకులకు వలవేసి ఐఎస్ఐఎస్లోకి చేర్పిస్తున్న ఆమెను రెండు రోజుల క్రితం ఫిలిప్పీన్స్ నేషనల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎన్బీఐ) అరెస్టుచేసిన సంగతి తెలిసిందే. ఆన్లైన్ వేదికగా ప్రత్యేకించి భారతీయ యువకులను ప్రేరేపిస్తున్న హమిడాన్... ఫిలిప్పీన్స్లోని మనీలాలో పట్టుబడింది.
ఇప్పటికే ఆమెపై రెండు చార్జిషీట్లు దాఖలు చేసిన ఎన్ఐఏ... హమిడాన్ వివరాలు, ఆధారాలు కావాలంటూ గతేడాది ఫిలిప్పీన్స్ను కోరిన సంగతి తెలిసిందే. ఆన్లైన్లో ప్రత్యేకించి సోషల్ మీడియాను అడ్డగా చేసుకుని అనేక మంది భారతీయులకు ఆమె వల వేసినట్టు భారత దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. భారత్ సహా పలు దేశాల నుంచి ఐసిస్లోకి 'ఫారెన్ ఫైటర్స్'ను రిక్రూట్ చేసుకునేందుకు ఆమె చురుగ్గా వ్యవహారం నడిపినట్టు సమాచారం. కాగా తాము హమిడాన్ ప్రభావం వల్లే ఐసిస్లో చేరినట్టు ఇద్దరు భారత ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు వెల్లడించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







