బహ్రెయిన్లో దొంగల ముఠా పట్టివేత
- October 21, 2017మనామా: కింగ్డమ్లోని పలు ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న దొంగల ముఠాని అరెస్ట్ చేశారు పోలీసులు. 70,000 దిర్హామ్లకు పైగా విలువైన వస్తువుల్ని వీరు దొంగతనం చేసినట్లు పోలీసులు వెల్లడించారు. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఫోరెన్సిక్ సైన్స్, ఈ ముఠా ఆరు దొంగతనాలకు పాల్పడినట్లు ధృవీకరించింది. పక్కా వ్యూహంతో ఈ గ్యాంగ్ దొంగతనాలకు పాల్పడుతోందని అధికారులు చెప్పారు. సీసీ టీవీ ఫుటేజ్ల ఆధారంగా నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. దొంగతనాల కోసం నిందితులు యూజ్డ్ కార్లను వినియోగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పబ్లిక్ ప్రాసిక్యూషన్ జారీ చేసిన అరెస్ట్ వారెంట్తో నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లీగల్ ప్రొసీడింగ్స్ జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్లు విడుదల..
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!