అమెరికాలో చిన్నారి షెరిన్ తండ్రి అరెస్టు
- October 24, 2017
అమెరికాలో గత కొన్నిరోజులుగా అదృశ్యమైన మూడేళ్ల చిన్నారి షెరిన్ ఆచూకీ ఇంకా తెలియరాలేదు. షెరిన్ ఇంటికి సమీపంలో లభించిన గుర్తుతెలియని చిన్నారి మృతదేహం వివరాలు కూడా ఇంకా తెలియరాలేదని పోలీసులు వెల్లడించారు. మరోవైపు ఈ కేసులో చిన్నారి తండ్రి వెస్లీ మాథ్యూస్ను పోలీసులు అరెస్టు చేశారు. విచారణ సమయంలో వెస్లీ తన కుమార్తె అదృశ్యంపై పొంతనలేని విషయాలు చెప్పడంతో అనుమానం వచ్చిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
డాలస్ శివారు ప్రాంతానికి చెందిన వెస్లీ మాథ్యూస్ తన మూడేళ్ల కుమార్తె షెరిన్ పాలు తాగట్లేదని అక్టోబర్ 7న చిన్నారికి కఠిన శిక్ష విధించిన విషయం తెలిసిందే. రాత్రంతా ఇంటి బయటే నిలబడాలని ఆమెను ఆదేశించాడు. అయితే అప్పటి నుంచి షెరిన్ కనబడకుండా పోయింది. చిన్నారిని ఇంటి నుంచి పంపించిన 15 నిమిషాలకే తాను వెళ్లి చూశానని.. అప్పటికే పాప కనబడలేదని వెస్లీ చెప్పాడు. అయితే అఫిడవిట్లో మాత్రం తాను సూర్యోదయం అయ్యాక వెళ్లి చూశానని పేర్కొన్నాడు.
ఇదిలా ఉండగా.. గత ఆదివారం వెస్లీ ఇంటికి సమీపంలో ఓ చిన్నారి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఈ మృతదేహం షెరిన్దే అయి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మృతదేహం దొరికిన తర్వాత వెస్లీ మాటమార్చినట్లు, పొంతనలేని సమాధానాలు చెప్పినట్లు పోలీసులు పేర్కొన్నారు. అయితే అతడు ఏం చెప్పాడో మాత్రం బయటకు వెల్లడించలేదు. దీంతో అతడిని అరెస్టు చేసి విచారిస్తున్నారు. భారత్లో పుట్టిన షెరిన్ను వెస్లీ దంపతులు రెండేళ్ల క్రితం దత్తత తీసుకున్న విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...







