ఫిఫా వరల్డ్కప్కు ఇస్లామిక్ స్టేట్ బెదిరింపు
- October 25, 2017
వచ్చే ఏడాది రష్యాలో జరిగే ఫిఫా వరల్డ్కప్కు మరోసారి హెచ్చరికలు జారీ చేసింది ఇస్లామిక్ స్టేట్. ఐఎస్కు చెందిన వఫా మీడియా ఫౌండేషన్ ట్విట్టర్లో ఈ బెదిరింపు సందేశాన్ని ఉంచింది. దీనికోసం అర్జెంటీనా, బార్సిలోనా సూపర్స్టార్ లియోనెల్ మెస్సీ ఫొటోను వాడుకుంది. మెస్సీ రక్త కన్నీరు కారుస్తున్నట్లుగా ఫొటోను సృష్టించి.. మీరు పోరాడుతున్న రాజ్యం ఓటమెరుగనిది అని కామెంట్ పెట్టింది. ఓ ఇంటెలిజెన్స్ గ్రూప్ మంగళవారం ఈ ట్వీట్ను గుర్తించింది. అంతేకాదు నైకీ ఫేమస ట్యాగ్లైన్ అయిన జస్ట్ డూ ఇట్ను కాస్త మార్చి.. జస్ట్ టెర్రరిజం అన్న క్యాప్షన్ను కూడా ఈ ఫొటోకు పెట్టడం గమనార్హం. వచ్చే ఏడాది జరిగే ఈ వరల్డ్కప్కు ఇప్పటికే ఇస్లామిక్ స్టేట్ నుంచి ఎన్నో బెదిరింపులు వచ్చాయి. ఈ మధ్యే ఫ్రాన్స్, జర్మనీ మధ్య ఫ్రెండ్లీ మ్యాచ్ సందర్భంలోనూ ఐఎస్.. పారిస్లో పేలుళ్లకు పాల్పడిన విషయం తెలిసిందే. 2016 యురోపియన్ చాంపియన్షిప్కు కూడా ఈ ఉగ్ర సంస్థ ఇలాగే హెచ్చరికలు జారీ చేసినా.. ఆ టోర్నీ ఎలాంటి అవాంచనీయ ఘటనలు లేకుండా సాఫీగా పూర్తయింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







