కమల్పై కేసు పెట్టండి: మద్రాస్ హైకోర్టు ఆదేశం
- October 25, 2017
ప్రముఖ సినీనటుడు కమల్హాసన్ వివాదంలో చిక్కుకున్నారు. ఇటీవల నేలవేము మొక్కను తన అభిమానులెవరూ పంచొద్దంటూ కమల్ ట్వీట్ చేశారు. తమిళనాడు ప్రభుత్వం డెంగీ వ్యాధికి విరుగుడుగా ఈ మొక్కను పంపిణీ చేస్తోంది. అలాంటి సమయంలో కమల్ చేసిన ఈ వ్యతిరేక ప్రచారం చర్చనీయాంశమైంది. కమల్హాసన్ చేసిన ట్వీట్పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ అడ్వకేట్ క్లర్క్ జి.దేవరాజన్ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ను విచారణకు స్వీకరించిన మద్రాస్ హైకోర్టు కమల్పై కేసు నమోదు చేయాలని చెన్నై నగర పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.
ఏ వైద్య ప్రమాణాల ఆధారంగా కమల్ నేలవేము మొక్క గురించి ట్వీట్ చేశారో చెప్పాలని పిటిషనర్ డిమాండ్ చేశారు. ఈ మొక్కను వాడటం వల్ల దుష్ఫలితాలు వస్తాయని కమల్ ఏ ప్రాతిపాదికన చెప్పారో స్పష్టం చేయాలని కూడా దేవరాజన్ పిటిషన్లో అడిగారు. ఆయన స్వతహాగా నేలవేము మొక్కను వినియోగించి.. దుష్ఫలితాలను చవిచూశారేమో చెప్పాలని పిటిషనర్ ప్రశ్నించారు. సరైన ఆధారాలు లేకుండా కమల్ నేలవేము మొక్క గురించి ట్వీట్ చేశారని పిటిషనర్ దేవరాజన్ తప్పు బట్టారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







