బహ్రెయినీ స్కూలు విద్యార్థికి గాయం - అనుమానం
- October 25, 2017
మనామా: నర్సరీ స్కూల్ విద్యార్థిని భుజానికి ఫ్రాక్చర్ అవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమెకు వైద్య చికిత్స అందిస్తున్న వైద్యులు, చిన్నారి కోలుకోవడానికి ఏడాది పాటు సమయం పడుతుందని చెప్పారు. బాధితురాలి తల్లి మాట్లాడుతూ, స్కూల్లో ఏం జరిగిందో స్కూలు యాజమాన్యం వెల్లడించలేదనీ, దాంతో చికిత్సలో కొంత జాప్యం జరిగిందని చెప్పారు. ఘటనకు బాధ్యులైన స్కూలు యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితురాలి తల్లి డిమాండ్ చేస్తున్నారు. స్కూల్లోని సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలిస్తే వాస్తవాలు తెలుస్తాయంటున్నారామె. ఈ ఘటనపై సోషల్ మీడియాలో బాధితురాలి తల్లి పోరాటం చేస్తున్నారు. ఈ ఘటనపై స్పందించిన మినిస్ట్రీ, విచారణ కొనసాగుతున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. తొలుత స్కూలు యాజమాన్యం చిన్నారికి ఏమీ అవలేదని చెప్పడం, ఆ తర్వాత స్లైడ్ నుంచి టంబుల్ అయినట్లుగా పేర్కొనడం పలు అనుమానాలకు తావిస్తున్నట్లు బాధితురాలి తల్లి పేర్కొంటున్నారు.
తాజా వార్తలు
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు







