వరంగల్ పార్లమెంట్ స్థానానికి 23 మంది అభ్యర్థులు

- November 07, 2015 , by Maagulf
వరంగల్ పార్లమెంట్ స్థానానికి 23 మంది అభ్యర్థులు

వరంగల్ పార్లమెంట్ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికల్లో 23 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. నామినేషన్ల ఉపసంహరణకు ఆఖరి రోజైన శనివారం 8 మంది నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. ప్రధాన రాజకీయ పార్టీ అభ్యర్థులు పసునూరి దయాకర్ (టీఆర్‌ఎస్), సర్వే సత్యనారాయణ (కాంగ్రెస్), నల్లా సూర్యప్రకాశరావు (వైఎస్సార్‌సీపీ), దేవయ్య (ఎన్డీఏ) , వినోద్ కుమార్ (వామపక్షాలు) పోటీపడుతున్నారు. మొత్తానికి ఈ నియోజకవర్గంలో బహుముఖ పోటీ జరుగనుంది. కాంగ్రెస్ పార్టీ తరపున డమ్మీ అభ్యర్థులుగా నామినేషన్లు వేసిన విజయరామారావు, కొండేటి శ్రీధర్, రాజారపు ప్రతాప్, బొచ్చు సమ్మయ్య నామినేషన్ ఉపసంహరించుకున్న వారిలో ఉన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య.. కోడలు, మనవళ్ల మృతి నేపథ్యంలో పోటీ నుంచి వైదొలగిన విషయం విదితమే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com