వైఎస్ జగన్ నుంచి జెఎమ్ఆర్ గా సంచలన ప్రకటన

- November 03, 2017 , by Maagulf
వైఎస్ జగన్ నుంచి జెఎమ్ఆర్ గా సంచలన ప్రకటన

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నవంబర్ 6 నుంచి పాదయాత్ర చేయబోతున్న విషయం తెలిసిందే. ఏపీలో ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకోవడమే లక్ష్యంగా ఈ పాదయాత్రను ఆయన చేపట్టనున్నారు.అయితే ఈ పాదయాత్రకు సంబంధించి కొంతమంది పండితులు జగన్ అని పిలిచే పిలుపులో మార్పులు చేసినట్లు తెలుస్తుంది. జెఎమ్ఆర్ (జగన్ మోహన్ రెడ్డి) అనే పిలుపులో బలముందని సూచించినట్లు తెలుస్తుంది.
వైఎస్ జగన్ కూడా దానికి తగ్గట్లే మీడియా మిత్రులకు పాదయాత్ర సమయంలో నా గురించి వార్తలు రాసేటప్పుడు జగన్ అనే బదులు జెఎమ్ఆర్ అనే పేరుతో రాయమని సూచించినట్లు తెలుస్తుంది. జగన్ అభిమానులకు జగన్. జగన్ అని పిలుచుకోవడం బాగా అలవాటు, ఆ పేరుతో అభిమానులు ఎన్నో పాటలు కూడా రూపొందించారు. ఇప్పుడు జెఎమ్ఆర్ అని పిలవడం కష్టమైన పనే అయినా.. అధినాయకుడు ఆదేశిస్తే అభిమానులు ప్రేమతో జెఎమ్ఆర్ అనే పేరును త్వరలోనే అలవాటు చేసుకుంటారులే అని వైసీపీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com