2018 నుంచి 30 ఏళ్ళ లోపు గ్రాడ్యుయేట్లు...డిప్లొమా హోల్డర్లకు ఉద్యోగం లేదు
- November 05, 2017
కువైట్ : ' చదువుకు లేత ....పెళ్ళికి ముదురు ' వ్యక్తులు కావాలన్నట్లు... ఉద్యోగంకు ముదురు నిరుద్యోగులు కావాలనే పంధాని కువైట్ ప్రభుత్వం అమలుచేయనుంది. వచ్చే ఏడాది 2018 నుంచి 30 ఏళ్ళ లోపు వయస్సు ఉన్న డిగ్రీలు మరియు డిప్లొమాలు వ్యక్తుల నియామకాన్ని నిలిపివేయాలని ది మాన్పవర్ పబ్లిక్ అథారిటీ (పి ఎ ఎం ) ఒక నిర్ణయం శనివారం జారీ చేసింది. ఈ నిర్ణయం 2018 నుండి ప్రారంభమౌతుంది. ఈ వయస్సులో ఉన్న 30 ఏళ్ళ వయస్సు లోపు యువకులు తమ కువైట్ దేశాన్ని విడిచిపెడితే తప్ప వారి సర్టిఫికేట్లను అందచేయలేమని ఈ నిర్ణయం పేర్కొంది. వృత్తిపరమైన వర్గాల్లో తక్కువ వయస్సు గల ఏ కువైటీవాసులను నియమించలేదని పేర్కొంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలతో నిర్వహించబడే కొన్ని వృత్తులలో మరియు చిన్న కార్మికుల ఉద్యోగాలలో వేరేవారితో భర్తీ చేయడం వంటి చర్యలను కూడా అమలు చేస్తుంది. భద్రతా దళాలకు కాంట్రాక్టుల శాతాన్ని తగ్గించడానికి మరియు పారిశ్యుద్ద కార్మికుల సంఖ్యను తగ్గించాలని మంత్రిత్వ శాఖ కోరుతుంది. ప్రభుత్వ ఒప్పందాల సంఖ్య 2,274 గా ఉన్నట్లు అథారిటీ సూచించింది. అయితే ఆ కాంట్రాక్టుల్లో నమోదైన కార్మికుల సంఖ్య 447,077 మంది కార్మికులు కొనసాగుతున్నట్లు తెలియచేసింది..
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







