లోపాలుగల బస్ అమ్మకం: డీలర్కి జైలు, జరీమానా
- November 05, 2017
మస్కట్: లోపాలుగల బస్ని అమ్మినందుకు, సరైన రీతిలో దాన్ని రిపెయిర్ చెయ్యనందుకుగాను ఓ డీలర్కి ఆరు నెలల జైలు శిక్ష అలాగే, 1000 ఒమన్ రియాల్స్ జరీమానా విధించింది న్యాయస్థానం. పబ్లిక్ అథారిటీ ఫర్ కన్స్యుమర్ ప్రొటెక్షన్, వాహన డీలర్ని న్యాయస్థానానికి తీసుకెళ్ళింది, వినియోగదారుడి ఫిర్యాదుతో. 25 సీటర్ బస్కి సంబంధించిన స్టీరింగ్ బ్యాలెన్స్ లేకపోవడం, చక్రాల నుంచి పొగ, ఆయిల్ వస్తుండడంతో డీలర్కి ఫిర్యాదు చేయగా, సమస్యను పరిష్కరించలేదు. ఈ నేపథ్యంలో నిజ్వా కోర్ట్ ఆఫ్ఫస్ట్ ఇన్స్టాన్స్ తీర్పునిస్తూ, డీలర్ది తప్పని తేల్చింది. డీలర్ కన్స్యుమర్ ప్రొటెక్షన్ చట్టాన్ని ఉల్లంఘించినట్లు న్యాయస్థానం పేర్కొంది. వినియోగదారుడు, అంతకు ముందు అల్ దక్లియా ప్రావిన్స్లోని కన్స్యుమర్ వాచ్డాగ్స్ని సంప్రదించి, తనకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేశారు. డీలర్ తక్షణమే 300 ఒమన్ రియాల్స్ లీగల్ ఖర్చుల కింద చెల్లించాలని కూడా డీలర్ని ఆదేశించింది.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







