రూ.100 కోట్ల తో తెలంగాణలో స్కైవిన్ యూనిట్
- November 06, 2017
విపణిలోకి నాలుగు కొత్త మోడళ్లు
వచ్చే ఏడాది నాటికి రూ.100 కోట్ల పెట్టుబడితో తెలంగాణలో స్మార్ట్ఫోన్ పరిజ్ఞానంతో కూడిన మొబైళ్ల తయారీ యూనిట్ను నెలకొల్పబోతున్నట్లు స్కైవిన్ కమ్యూనికేషన్స్ ప్రకటించింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.100 కోట్ల టర్నోవరు సాధించాలని కూడా లక్ష్యంగా సంస్థ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ సురేష్ భీమినేని పెట్టుకున్నట్లు వివరించారు. స్కైవిన్ ఆదివారం విపణిలోకి 4 కొత్త ఫీచర్ ఫోన్ల ( ఐ-9, ఐ-8, ఐ-5, ఐ-1) ను ప్రవేశపెట్టింది. వీటిని తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ స్వామిగౌడ్, ప్రభుత్వ చీఫ్ విప్ పాతూరి సుధాకర్రెడ్డి, బేవరేజస్ కార్పొరేషన్ ఛైర్మన్ దేవీప్రసాద్ తదితరులు ఆవిష్కరించారు. సంస్థ నాలుగో వార్షికోత్సవం సందర్భంగా ఈ ఫోన్లను అందుబాటులోకి తెచ్చామని, వీటిని 40% క్యాష్బ్యాక్తో అందిస్తున్నామని సురేష్ భీమినేని తెలిపారు.
తాజా వార్తలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!







