ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- September 21, 2025
మనామా: బహ్రెయిన్ ఆటం సీజన్ లోకి ప్రవేశిస్తుంది. ఈ సంవత్సరం మొదటిసారిగా 40°C కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అంచనా వేస్తున్నారు. తేమ 70% మించకుండా ఉంటుందని, కనిష్ట ఉష్ణోగ్రతలు దాదాపు 27°Cకి తగ్గుతాయని వాతావరణ డైరెక్టరేట్ పేర్కొంది. సెప్టెంబర్ 25వరకు వాయువ్య గాలులు చురుకుగా ఉంటాయని తెలిపింది.
గత వారం రోజులుగా బహ్రెయిన్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గాయని వెల్లడించింది. ముఖ్యంగా సముద్రంలోనికి వెళ్లే వారు జాగ్రత్తగా ఉండాలని, అధికారిక వాతావరణ హెచ్చరికలను ఫాలో కావాలని నివాసితులకు డైరెక్టరేట్ సూచించింది. అక్టోబర్ నెల చివరి నాటికి రాత్రిసమయాల్లో వాతావరణం చల్లగా ఉంటుందని, నవంబర్ చివరి వరకు పగటిపూట చల్లదనం కొనసాగుతుందని తెలిపారు. మరోవైపు, పిల్లలు మరియు వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వారికి కాలానుగుణ అనారోగ్యాల వ్యాప్తి అధికంగా ఉంటుందని వైద్యులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- హర్మూజ్ పై ఇరాన్ వార్నింగ్..
- దౌత్య సంబంధాలు బలోపేతం..అంటాల్యా ఫోరంలో ఎమీర్..!!
- షురా కౌన్సిల్ ముందుకు కీలక బిల్లులు...!!
- ఖతార్ జాతీయ గుర్తింపు కార్డు వినియోగానికి అనుమతి..ఆరోగ్య కార్డు జారీ నిలిపివేత..!!
- సౌదీలో మనీలాండరింగ్ నిరోధక చట్టం సవరణ.. నేరస్థులపై ట్రావెల్ బ్యాన్..!!
- 100% సామర్థ్యంతో కువైట్ బ్యాంకులు రన్..!!
- దుబాయ్ లో 48 గంటల్లో ఐరిష్ క్రిమినల్ గ్యాంగ్ మెంబర్ అరెస్టు..!!
- ఖతర్లో సేవలకు తెలంగాణ గల్ఫ్ సమితి అధ్యక్షుడు మైదం మధుకు ఎంబసీ సత్కారం
- IPL 2026: కోల్కతా నైట్ రైడర్స్ కు మరో ఓటమి..
- ఘనంగా జరిగిన ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ (INCA) అవార్డ్స్ వేడుక









