ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- September 21, 2025
మనామా: బహ్రెయిన్ ఆటం సీజన్ లోకి ప్రవేశిస్తుంది. ఈ సంవత్సరం మొదటిసారిగా 40°C కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అంచనా వేస్తున్నారు. తేమ 70% మించకుండా ఉంటుందని, కనిష్ట ఉష్ణోగ్రతలు దాదాపు 27°Cకి తగ్గుతాయని వాతావరణ డైరెక్టరేట్ పేర్కొంది. సెప్టెంబర్ 25వరకు వాయువ్య గాలులు చురుకుగా ఉంటాయని తెలిపింది.
గత వారం రోజులుగా బహ్రెయిన్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గాయని వెల్లడించింది. ముఖ్యంగా సముద్రంలోనికి వెళ్లే వారు జాగ్రత్తగా ఉండాలని, అధికారిక వాతావరణ హెచ్చరికలను ఫాలో కావాలని నివాసితులకు డైరెక్టరేట్ సూచించింది. అక్టోబర్ నెల చివరి నాటికి రాత్రిసమయాల్లో వాతావరణం చల్లగా ఉంటుందని, నవంబర్ చివరి వరకు పగటిపూట చల్లదనం కొనసాగుతుందని తెలిపారు. మరోవైపు, పిల్లలు మరియు వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వారికి కాలానుగుణ అనారోగ్యాల వ్యాప్తి అధికంగా ఉంటుందని వైద్యులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- TPCC డాక్టర్స్ సెల్ వైస్ చైర్మన్ గా డాక్టర్ కరిష్ని చిత్తర్వు నియామకం..!!
- ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణి చేసిన ఎంపి బాలశౌరి
- ఏపీ: కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు
- హైదరాబాద్లో గ్లోబల్ ఇన్నోవేషన్ సమ్మిట్ 2026
- 2026 సెలవుల క్యాలెండర్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
- శ్రీరాముడి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ
- మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసిన సందీప్ మక్తాలా
- NABARD రిక్రూట్మెంట్ అలర్ట్–అర్హతలు, తేదీల పూర్తి వివరాలు…
- రష్యా అధ్యక్షుడు పుతిన్ డిసెంబర్ 4న భారత పర్యటన..
- షార్క్ లో NBK క్షేత్ర పర్యటన..!!







