ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- September 21, 2025
మనామా: బహ్రెయిన్ ఆటం సీజన్ లోకి ప్రవేశిస్తుంది. ఈ సంవత్సరం మొదటిసారిగా 40°C కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అంచనా వేస్తున్నారు. తేమ 70% మించకుండా ఉంటుందని, కనిష్ట ఉష్ణోగ్రతలు దాదాపు 27°Cకి తగ్గుతాయని వాతావరణ డైరెక్టరేట్ పేర్కొంది. సెప్టెంబర్ 25వరకు వాయువ్య గాలులు చురుకుగా ఉంటాయని తెలిపింది.
గత వారం రోజులుగా బహ్రెయిన్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గాయని వెల్లడించింది. ముఖ్యంగా సముద్రంలోనికి వెళ్లే వారు జాగ్రత్తగా ఉండాలని, అధికారిక వాతావరణ హెచ్చరికలను ఫాలో కావాలని నివాసితులకు డైరెక్టరేట్ సూచించింది. అక్టోబర్ నెల చివరి నాటికి రాత్రిసమయాల్లో వాతావరణం చల్లగా ఉంటుందని, నవంబర్ చివరి వరకు పగటిపూట చల్లదనం కొనసాగుతుందని తెలిపారు. మరోవైపు, పిల్లలు మరియు వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వారికి కాలానుగుణ అనారోగ్యాల వ్యాప్తి అధికంగా ఉంటుందని వైద్యులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- ఒమాన్లోని డుక్మ్ పోర్ట్ పై డ్రోన్ దాడి
- పాకిస్తాన్లోని అమెరికా రాయబార కార్యాలయం వీసా అపాయింట్మెంట్ రద్దు
- CBSE అలర్ట్: గల్ఫ్ దేశాల్లో మార్చి 5, 6 తేదీల్లో జరగాల్సిన బోర్డు పరీక్షలు కూడా వాయిదా!
- అన్ని శాఖల్లో ఎఐ వినియోగం పై సీఎం చంద్రబాబు సమీక్ష
- దుబాయ్ నుంచి భారత్కు సురక్షితంగా చేరుకున్న పీవీ సింధు!
- 15 మిడిలీస్టు దేశాలను వీడండి..అమెరికన్లకు ఎమర్జెన్సీ అలెర్ట్ జారీ..!!
- గంటన్నరలో హైదరాబాద్ నుండి అమరావతికి !!
- అన్ని ఎంట్రీ వీసాలను ఒక నెల పాటు పొడిగించిన ఖతార్..!!
- ఫాల్స్ కంటెంట్ వ్యాప్తి..బహ్రెయిన్ లో పలువురు అరెస్టు..!!
- అన్ని ఎయిర్ యాక్టివిటీస్ ను నిలిపివేసిన ఒమన్..!!









