ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- September 21, 2025
దోహా: ఖతార్ లో ఎలక్ట్రిక్ వెహికల్ (EV) ఛార్జింగ్ స్టేషన్లను విస్తరించనున్నారు. దేశవ్యాప్తంగా దాదాపు 200 ఛార్జింగ్ స్టేషన్లు అందుబాటులో ఉన్నాయని ఖతార్ జనరల్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ కార్పొరేషన్ (కహ్రామా) ఎలక్ట్రిక్ వెహికల్ యూనిట్ అధిపతి, ఇంజినీర్ మొహమ్మద్ ఖలీద్ అల్ షర్షానీ ప్రకటించారు. తార్షీద్ స్మార్ట్ EV ఛార్జింగ్ ప్రోగ్రామ్ కింద గ్రీన్ మొబిలిటీని పెంచుతున్నట్లు పేర్కొన్నారు.
తార్షీద్ స్మార్ట్ EV ఛార్జింగ్ యాప్ ద్వారా వినియోగదారులు ఛార్జింగ్ స్టేషన్ స్థానాలు, ఛార్జింగ్ హిస్టరీని సులువుగా తెలుసుకోవచ్చని తెలిపారు. ప్రస్తుతం, ఛార్జింగ్ స్టేషన్లు దోహా మరియు ఉత్తర ఖతార్లో విస్తృతంగా ఉన్నాయని, రాబోయే దశల్లో పశ్చిమ మరియు వాయువ్య ప్రాంతాలలో విస్తరించనున్నట్లు వెల్లడించారు. ప్రజా డిమాండ్ మేరకు ఈవీ మౌలిక సదుపాయాలను విస్తరణ ప్రణాళికలను అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- అన్ని ఎయిర్ యాక్టివిటీస్ ను నిలిపివేసిన ఒమన్..!!
- రియాద్ లో యూఎస్ ఎంబసీపై డ్రోన్ దాడిపై సౌదీ క్లారిటీ..!!
- విదేశాలలో చిక్కుకున్న నివాసితులు..ఖర్చులపై ఆందోళన..!!
- వైరల్ అవుతున్న ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మనుమరాలి ఫోటో
- భయం లేదు..అంతా ప్రశాంతం..యూఏఈ నివాసితులు..!!
- భారతీయులకు అనవసర ప్రయాణాలు మానుకోవాలని భారత రాయబార కార్యాలయం సూచన
- రష్యా అధ్యక్షుడి నుంచి బహ్రెయిన్ రాజుకు ఫోన్ కాల్
- బ్లాక్ సంస్థలో భారీగా ఉద్యోగాల కోత
- సౌదీ, బహ్రెయిన్ పాలకులకు మోదీ ఫోన్
- ఇరాన్ పై దాడుల నిర్ణయంతో ట్రంప్ పై అమెరికాలో రాజకీయ వివాదం









