ఇనాగ్రల్ ప్లాజాలోనే మెట్రోరైలు ప్రారంభం
- November 12, 2017
హైదరాబాద్: ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా ప్రారంభించనున్న మెట్రోరైలు ఇనాగ్రల్ ప్లాజా సిద్ధమవుతున్నది. మియాపూర్ డిపో వద్ద నిర్మిస్తున్న ఈ ప్లాజా అత్యంత సుందరంగా, మెట్రోరైలు కారిడార్లను తలపించేలా డిజైన్ చేశారు. మూడు ఆర్చీలతో మియాపూర్ మెట్రో స్టేషన్ను ఆనుకొని దీనిని నిర్మిస్తున్నారు. ప్రధాని మోదీ ఇక్కడే ప్రాజెక్టుకు సంబంధించిన ప్లాజాను ఆవిష్కరించిన అనంతరం మెట్రోరైలులో ప్రయాణించనున్నారు. ప్రారంభ సన్నాహాల్లో భాగంగా ప్లాజా పనులను మెట్రోరైలు అధికారులు వేగవంతం చేశారు. ప్రారంభించబోయే రోజు ప్లాజా ప్రాంతంలో స్వాగత తోరణాలతోపాటు, మెట్రోరైలుకు సంబంధించిన సమాచారంతో కూడిన ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేయనున్నారు. ప్లాజాను 360 డిగ్రీల్లో గుండ్రంగా నిర్మించడంతోపాటు మధ్యలో నీటి కొలను, చుట్టుపక్కల పచ్చిక బయళ్లను అభివృద్ధి చేసి అందంగా తయారు చేస్తున్నారు.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







