కాలుష్యం కారణంగా అస్తవ్యస్తంగా మారిన రవాణా వ్యవస్థ
- November 12, 2017
న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరమైన న్యూఢిల్లీలో కాలుష్యం శాతం పెరుగుతోంది. అంతేకాదు, ఢిల్లీలో కాలుష్యం స్థాయిని తెలుపుతూ ప్రపంచ పర్యావరణ సంస్థ హెచ్చరికలు జారీ చేసిన విషయం విధితమే. ఇప్పుడు ఇదే విషయం దేశమంతటా చర్చనీయాంశమైంది. దీంతో మేల్కొన్న ప్రభుత్వం కాలుష్య నివారణకు ఇప్పుడిప్పుడే చర్యలను ముమ్మరం చేసింది కూడాను.
అయితే, తాజా సమాచారం మేరకు ఢిల్లీలో కాలుష్యం ప్రభావం కారణంగా 34 రైళ్లు ఆలస్యంగా నడవనున్నాయి. అంతేకాక 21 రైళ్ల సమయాల్లో మార్పు, ఎనిమిది రైళ్లను రద్దు చేసినట్లు తెలిపారు ఉన్నతాధికారులు.
అయితే, గాలి కాలుష్యం తీవ్ర స్థాయికి పెరిగిపోవడంతో తమ కార్యాలయాలకు వెళ్లాల్సిన ప్రజలకు కాలుష్యంతో కూడిన పొగమంచు దుప్పటిలా కప్పబడటం వల్ల రోడ్లపై వచ్చే వారు కూడా సరిగా కనిపించలేదు. పశ్చిమ ఢిల్లీలో గాలి కలుషితమై ఆందోళనకరంగా మారింది. ఇదే కాలుష్యం మరో మూడు రోజులు కొనసాగితే, పాఠశాలలు, కార్యాలయాలకు సెలవులు ప్రకటించే యోచనలో ఉంది ప్రభుత్వం.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







