మృతుల కుటుంబాలకు ఏపీ సీఎం చంద్రబాబు పరామర్శ

- November 13, 2017 , by Maagulf
మృతుల కుటుంబాలకు ఏపీ సీఎం చంద్రబాబు పరామర్శ

కృష్ణానది పవిత్ర సంగమం ఘాట్‌కు సీఎం చంద్రబాబు చేరుకున్నారు. అక్కడ వాతవారణం చూసి చలించిపోయారు. ప్రమాద ఘటనా ప్రాంతాన్ని పరిశీలించిన బాబు... బోటు ప్రమాదంపై అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు. గల్లంతైన వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. చంద్రబాబు వెంట.. మంత్రులు కామినేని, అఖిలప్రియ ఉన్నారు. ప్రమాద ఘటనపై సీఎం అసెంబ్లీలో ప్రకటన చేయనున్నారు.

 అటు.. పడవ ప్రమాదంపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com