'లక్ష్మీస్ వీరగ్రంథం' సినిమా పై అవేధేన వ్యక్తం చేసిన లక్ష్మీ పార్వతి
- November 13, 2017
ప్రముఖ సినీనటుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు జీవితగాథపై తెరకెక్కుతున్న చిత్రం 'లక్ష్మీస్ వీరగ్రంథం' రోజుకో వివాదానికి కారణమవుతోంది. కేతిరెడ్డి జగదీష్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఆదివారం ప్రారంభమైంది. అయితే దీనిపై ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఎన్టీఆర్ ఘాట్లో తీసి ఆ స్థలాన్ని అపవిత్రం చేశారని ఆమె అన్నారు. అందుకోసం మంగళవారం ఎన్టీఆర్ ఘాట్ని పాలతో శుద్ధి చేసి పూజలు చేస్తున్నా అని తెలిపారు. మాకు నచ్చిన.. ఇష్టం లేని సినిమా లక్ష్మీస్ వీరగ్రంథం అని ఆమె స్పష్టం చేశారు. ఎవరి అనుమతి తీసుకుని సినిమా తీస్తున్నారని ఆమె ప్రశ్నించారు. ఈ సినిమా షూటింగ్పై పోలీసులకు ఫిర్యాదు చేశామని ఆమె తెలిపారు.
ఇదిలా ఉండగా దర్శకుడు జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా సినిమా తీసి తీరుతానిన స్పష్టం చేశారు. ఎన్టీఆర్ ఆత్మ తనకు మద్దతుగా ఉందని ఆయన తెలిపారు. లక్ష్మీ పార్వతీ ఈ సినిమాను ఆపేందుకు ఎంత ప్రయత్నించినా ఫలితం లేదని ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!







