'లక్ష్మీస్ వీరగ్రంథం' సినిమా పై అవేధేన వ్యక్తం చేసిన లక్ష్మీ పార్వతి
- November 13, 2017
ప్రముఖ సినీనటుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు జీవితగాథపై తెరకెక్కుతున్న చిత్రం 'లక్ష్మీస్ వీరగ్రంథం' రోజుకో వివాదానికి కారణమవుతోంది. కేతిరెడ్డి జగదీష్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఆదివారం ప్రారంభమైంది. అయితే దీనిపై ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఎన్టీఆర్ ఘాట్లో తీసి ఆ స్థలాన్ని అపవిత్రం చేశారని ఆమె అన్నారు. అందుకోసం మంగళవారం ఎన్టీఆర్ ఘాట్ని పాలతో శుద్ధి చేసి పూజలు చేస్తున్నా అని తెలిపారు. మాకు నచ్చిన.. ఇష్టం లేని సినిమా లక్ష్మీస్ వీరగ్రంథం అని ఆమె స్పష్టం చేశారు. ఎవరి అనుమతి తీసుకుని సినిమా తీస్తున్నారని ఆమె ప్రశ్నించారు. ఈ సినిమా షూటింగ్పై పోలీసులకు ఫిర్యాదు చేశామని ఆమె తెలిపారు.
ఇదిలా ఉండగా దర్శకుడు జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా సినిమా తీసి తీరుతానిన స్పష్టం చేశారు. ఎన్టీఆర్ ఆత్మ తనకు మద్దతుగా ఉందని ఆయన తెలిపారు. లక్ష్మీ పార్వతీ ఈ సినిమాను ఆపేందుకు ఎంత ప్రయత్నించినా ఫలితం లేదని ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!







