పవన్కు అదిరిపోయే ఆఫర్ ఇచ్చిన మైత్రీ మూవీస్ సంస్థ
- November 13, 2017
పవర్స్టార్ పవన్ కళ్యాణ్కు అదిరిపోయే ఆఫర్ వచ్చింది. పవన్ ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. అజ్ఞాతవాసి టైటిల్తో తెరకెక్కుతోన్న ఈ సినిమా వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 10న థియేటర్లలోకి దిగనుంది. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిన వెంటనే పవన్ వచ్చే ఎన్నికల నేపథ్యంలో పొలిటికల్ కార్యక్షేత్రంలోకి దూకుతాడని అందరూ భావిస్తున్నారు.
ఇదిలా ఉంటే వాస్తవానికి పవన్ మధ్యలో చాలా సినిమాలకు కమిట్ అయ్యాడు. ఈ సినిమాలతో పెట్టుకుంటే పవన్ 2019 ఎన్నికలను ఎదుర్కోవడం చాలా కష్టం. పవన్తో సినిమా చేయాలని మైత్రీ మూవీస్ సంస్థ ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తోంది. పవన్ - కొరటాల శివ కాంబినేషన్ను సెట్ చేసేందుకు ఈ బ్యానర్ తీవ్రంగా కృషి చేస్తోంది. తమ బ్యానర్లో సినిమా చేస్తే పవన్కు రూ.40 కోట్ల రెమ్యునరేషన్ ఇస్తామని కూడా అదిరిపోయే ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
మైత్రీ మూవీస్ ఇచ్చిన ఈ బంపర్ ఆఫర్తో ఇప్పుడు పవన్ త్రివిక్రమ్ సినిమా తర్వాత ఈ సినిమా చేయాలా ? లేదా రాజకీయ క్షేత్రంలోకి వెళ్లిపోవాలా ? అన్నది తేల్చుకోలేకపోతున్నాడట. తమ బ్యానర్లో సినిమా చేసేందుకు పవన్ ఒప్పుకుంటే పవన్ రెమ్యునరేషన్తో కలిపి రూ.80 కోట్ల బడ్జెట్తో సినిమా రూపొందించాలని ప్లాన్ చేస్తున్నారట. ఇక పవన్కు ఇచ్చే రూ.40 కోట్లను కూడా ముందే ఇచ్చేందుకు కూడా మైత్రీ మూవీస్ వాళ్లు ఓకే చెప్పారట. మరి పవన్ ఈ డీల్కు ఓకే చెపితే సౌత్ ఇండియాలో సూపర్స్టార్ రజనీకాంత్ తర్వాత ఎక్కువ రెమ్యునరేషన్ అందుకున్నవారిలో పవన్ రెండో ప్లేస్లో నిలిచి అరుదైన రికార్డు సొంతం చేసుకుంటాడు.
తాజా వార్తలు
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన







