ఈ 40 రోజులు ఎంతో ఎంజాయ్ చేశా, థాంక్స్ టు ఆల్ - సమంత
- November 14, 2017
హైదరాబాద్: తన వెడ్డింగ్ సీజన్ రెండు రోజుల క్రితం జరిగిన రిసెప్షన్తో ముగిసిందని కథానాయిక సమంత అన్నారు. ఆదివారం సమంత, చైతన్యల రిసెప్షన్ను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ వింధుకు సినీ, రాజకీయ, మీడియా ప్రముఖులు హాజరై నూతన దంపతులకు శుభాకాంక్షలు చెప్పారు. అయితే ఈ కార్యక్రమంలో దిగిన కొన్ని ఫొటోలను సమంత ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. అక్టోబరు 6న తన పెళ్లి జరిగినప్పటి నుంచి నిర్వహించిన వేడుకల గురించి ప్రస్తావించారు.
'చివరికి వెడ్డింగ్ సీజన్ పూర్తైంది. 40 రోజుల్లో మొత్తం 100 వేడుకలు జరిగాయి. ఈ అందమైన దుస్తులు ధరించి, చాలా ఎంజాయ్ చేశా' అని సమంత ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో పేర్కొన్నారు. దీంతోపాటు లవ్ మై ఫ్యామిలీ, ఎప్పటికీ మీకు కృతజ్ఞురాలిని అనే హ్యాష్ట్యాగ్స్ను కూడా జత చేశారు.
సమంత ప్రస్తుతం 'రంగస్థలం 1985' చిత్రంలో నటిస్తున్నారు. రామ్చరణ్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు. పల్లెటూరి నేపథ్యంలో రూపొందిస్తున్న ఈ చిత్రంలో చెర్రీ, సామ్ గతంలో కంటే చాలా విభిన్నమైన లుక్స్లో కనిపించనున్నారు. సంక్రాంతికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరోపక్క సమంత ప్రధాన పాత్రలో అలనాటి నటి సావిత్రి బయోపిక్ 'మహానటి' తెరకెక్కుతోంది. దీంతోపాటు సమంత పలు తమిళ చిత్రాల్లో కథానాయిక పాత్ర పోషిస్తున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







