దారుణంగా హత్య చేయబడ్డ వల్లభనేని
- November 15, 2017
హైదరాబాద్: నగరంలో దారుణ ఘటున చోటు చేసుకుంది. టీఆర్ఎస్ నాయకుడు, విద్యావేత్త వల్లభనేని శ్రీనివాసరావును కొందరు దుండగులు దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన బుధవారం అర్ధరాత్రి జరిగినట్లుగా పోలీసులు భావిస్తున్నారు.
శ్రీనివాసరావు తలపై బండరాళ్లతో మోది హత్య చేశారు నిందితులు. సనత్నగర్ బస్టాండ్లో ఈ ఘటన జరిగింది. గురువారం తెల్లవారుజామున మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
సనత్నగర్ ఇన్స్పెక్టర్ వెంకటరెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని, శ్రీనివాసరావు హత్య ఎవరు చేశారన్నదానిపై దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. శ్రీనివాసరావు మృతితో ఆయన కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







