దారుణంగా హత్య చేయబడ్డ వల్లభనేని

- November 15, 2017 , by Maagulf
దారుణంగా హత్య చేయబడ్డ వల్లభనేని

హైదరాబాద్‌: నగరంలో దారుణ ఘటున చోటు చేసుకుంది. టీఆర్ఎస్ నాయకుడు, విద్యావేత్త వల్లభనేని శ్రీనివాసరావును కొందరు దుండగులు దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన బుధవారం అర్ధరాత్రి జరిగినట్లుగా పోలీసులు భావిస్తున్నారు.
శ్రీనివాసరావు తలపై బండరాళ్లతో మోది హత్య చేశారు నిందితులు. సనత్‌నగర్‌ బస్టాండ్‌లో ఈ ఘటన జరిగింది. గురువారం తెల్లవారుజామున మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
సనత్‌నగర్‌ ఇన్‌స్పెక్టర్‌ వెంకటరెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని, శ్రీనివాసరావు హత్య ఎవరు చేశారన్నదానిపై దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. శ్రీనివాసరావు మృతితో ఆయన కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com