ఆ విషయం చెప్పింది నేనే..: లక్ష్మీపార్వతి
- November 21, 2017
హైదరాబాద్: తన ఇంటి పక్కన వైన్షాప్ ఏర్పాటు చేయాలనే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం సరికాదని వైసీపీ నేత లక్ష్మీపార్వతి అన్నారు. లక్ష్మీపార్వతి నివాసానికి దగ్గర్లో వైన్షాప్ ఏర్పాటుచేయాలని నూతన ఎక్సైజ్ పాలసీలో భాగంగా తెలంగాణ ఎక్సైజ్ శాఖ నిర్ణయించింది. విషయం తెలుసుకున్న లక్ష్మీపార్వతి ఈ నిర్ణయాన్ని తప్పుపట్టారు. ఇదే విషయమై మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆవిడ.. వైన్షాప్ ఏర్పాటుకు వ్యతిరేకంగా ఎక్సైజ్ కమిషనర్కు ఫిర్యాదుచేశానని చెప్పారు. కాదని వైన్షాప్ ఏర్పాటు చేస్తే ధర్నా చేస్తానని హెచ్చరించారు. అప్పట్లో మద్యపానం నిషేధించాలని స్వర్గీయ ఎన్టీఆర్కు చెప్పింది తానేనన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎక్సైజ్ పాలసీ మార్చుకోవాలని హితవుచెప్పారు.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







