ఆ విషయం చెప్పింది నేనే..: లక్ష్మీపార్వతి

- November 21, 2017 , by Maagulf
ఆ విషయం చెప్పింది నేనే..: లక్ష్మీపార్వతి

హైదరాబాద్‌: తన ఇంటి పక్కన వైన్‌షాప్ ఏర్పాటు చేయాలనే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం సరికాదని వైసీపీ నేత లక్ష్మీపార్వతి అన్నారు. లక్ష్మీపార్వతి నివాసానికి దగ్గర్లో వైన్‌షాప్ ఏర్పాటుచేయాలని నూతన ఎక్సైజ్ పాలసీలో భాగంగా తెలంగాణ ఎక్సైజ్ శాఖ నిర్ణయించింది. విషయం తెలుసుకున్న లక్ష్మీపార్వతి ఈ నిర్ణయాన్ని తప్పుపట్టారు. ఇదే విషయమై మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆవిడ.. వైన్‌షాప్ ఏర్పాటుకు వ్యతిరేకంగా ఎక్సైజ్ కమిషనర్‌కు ఫిర్యాదుచేశానని చెప్పారు. కాదని వైన్‌షాప్‌ ఏర్పాటు చేస్తే ధర్నా చేస్తానని హెచ్చరించారు. అప్పట్లో మద్యపానం నిషేధించాలని స్వర్గీయ ఎన్టీఆర్‌కు చెప్పింది తానేనన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎక్సైజ్‌ పాలసీ మార్చుకోవాలని హితవుచెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com