ఆత్మాహుతి దాడిలో..50 మంది మృతి

- November 21, 2017 , by Maagulf
ఆత్మాహుతి దాడిలో..50 మంది మృతి

నైజీరియా: నైజీరియా మళ్లీ బాంబు దాడితో ఉలిక్కి పడింది. ఉదయం ఈశాన్య అదమవాలోని మసీదులో ప్రార్థనలు జరుగుతున్న సమయంలో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో దాదాపు 50 మంది మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఒక యువకుడు పేలుడు పదార్థలతో మసీదులోకి వచ్చి తనని తాను పేల్చేసుకున్నాడని ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com