యు. ఏ. ఈ. లో ‘తెలుగు పాఠ శాల’ప్రారంభోత్సవానికి ఆహ్వానం
- November 12, 2015
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో తెలుగు వెలుగును వికసింప చేయడానికి శ్రీమతి ఒబ్బిలిసేట్టి అనురాధ గారి కృషి ఫలితమైన ‘తెలుగు పాఠ శాల’ నవంబరు 14 నుండి ప్రారంభం కానుంది. నాలుగు లేదా ఆపై సంవత్సరాల వయసుగల చిన్నారులు ఇందులో చేరడానికి అర్హులు. ఈ కోర్సు పూర్తి అయిన తరువాత జరిగే పరీక్షలో ఉత్తీర్ణులయిన ఆరు సంవత్సరాల వయసు గల చిన్నారులకు పొట్టి శ్రీరాములు విశ్వ విద్యాలయం వారి నుండి ప్రమాణ పత్రం లభిస్తుంది. యు. ఏ. ఈ. అంతటా ఉన్న వీరి సెంటర్లలో, నెలకు రెండు తరగతులు జరుగుతాయి. మొదటగా సంస్థలో ఎన్ రోల్ చేసుకున్న 100 మంది చిన్నారులకు శిక్షణ ఉచితమని, ఆ తరువాతి వారికి సంవత్సరానికి 100 యు. ఏ. ఈ. డాలర్ల రుసుము ఉంటుందని శ్రీమతి అనురాధ తెలిపారు. సంస్థ ప్రారంభోత్సవానికి అందరు ఆహ్వానితులేనని, అంతే కాకుండా, ఆయా ప్రాంతాలలో బోధించడానికి, సమన్వయము చేయడానికి ఆసక్తి గల వారు తమను సంప్రదించాలని ఆమె కోరారు. మరి, మన చిన్నారులకు మన మాతృ భాషనూ నేర్పించడానికి మనం మన వంతు సహకారం అందించడమే ఆలస్యం!ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా డిప్యూటీ కౌన్సెల్ జనరల్ అనురాగ్ భూషణ్ గారు ,నేపాలీ ఎమ్బస్సడర్ ధనుంజయ్ జా గారు,ICWA కన్వీనర్ శ్రీ.కుమార్ గారు విచ్చేయనున్నారు.‘తెలుగు పాఠశాల’ కు సహాయ సహకారాలు అందించిన శ్రీ అజిత్ కుమార్ గారికి,శ్రీమతి ఒబ్బిలిసేట్టి అనురాధ గారు ప్రత్యేక అభినందనలు తెలిపారు.
‘తెలుగు పాఠశాల’ విజయవంతం అవ్వాలని ఆశిస్తున్నాము.మాగల్ఫ్.కామ్ తరపున శ్రీమతి ఒబ్బిలిసేట్టి అనురాధ గారికి ప్రత్యేక అభినందనలు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







