యు. ఏ. ఈ. లో ‘తెలుగు పాఠ శాల’ప్రారంభోత్సవానికి ఆహ్వానం

- November 12, 2015 , by Maagulf
యు. ఏ. ఈ. లో ‘తెలుగు పాఠ శాల’ప్రారంభోత్సవానికి ఆహ్వానం

యునైటెడ్  అరబ్  ఎమిరేట్స్ లో తెలుగు వెలుగును వికసింప  చేయడానికి  శ్రీమతి ఒబ్బిలిసేట్టి అనురాధ గారి కృషి ఫలితమైన ‘తెలుగు  పాఠ శాల’ నవంబరు 14 నుండి ప్రారంభం కానుంది. నాలుగు లేదా ఆపై  సంవత్సరాల వయసుగల చిన్నారులు ఇందులో చేరడానికి అర్హులు. ఈ కోర్సు పూర్తి అయిన తరువాత జరిగే పరీక్షలో ఉత్తీర్ణులయిన ఆరు సంవత్సరాల వయసు గల  చిన్నారులకు పొట్టి శ్రీరాములు విశ్వ విద్యాలయం వారి నుండి ప్రమాణ పత్రం లభిస్తుంది.   యు. ఏ. ఈ.  అంతటా ఉన్న వీరి సెంటర్లలో, నెలకు రెండు తరగతులు జరుగుతాయి. మొదటగా సంస్థలో ఎన్ రోల్  చేసుకున్న 100 మంది చిన్నారులకు శిక్షణ ఉచితమని, ఆ తరువాతి వారికి సంవత్సరానికి 100 యు. ఏ. ఈ. డాలర్ల రుసుము ఉంటుందని శ్రీమతి అనురాధ తెలిపారు. సంస్థ ప్రారంభోత్సవానికి అందరు ఆహ్వానితులేనని, అంతే కాకుండా, ఆయా ప్రాంతాలలో బోధించడానికి, సమన్వయము చేయడానికి ఆసక్తి గల వారు తమను సంప్రదించాలని ఆమె కోరారు. మరి, మన చిన్నారులకు మన మాతృ భాషనూ నేర్పించడానికి మనం మన వంతు సహకారం అందించడమే ఆలస్యం!ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా డిప్యూటీ కౌన్సెల్ జనరల్ అనురాగ్ భూషణ్ గారు ,నేపాలీ ఎమ్బస్సడర్ ధనుంజయ్ జా గారు,ICWA కన్వీనర్ శ్రీ.కుమార్ గారు విచ్చేయనున్నారు.‘తెలుగు  పాఠశాల’ కు సహాయ సహకారాలు అందించిన శ్రీ అజిత్ కుమార్ గారికి,శ్రీమతి ఒబ్బిలిసేట్టి అనురాధ గారు ప్రత్యేక అభినందనలు తెలిపారు.  

‘తెలుగు  పాఠశాల’  విజయవంతం అవ్వాలని ఆశిస్తున్నాము.మాగల్ఫ్.కామ్ తరపున శ్రీమతి ఒబ్బిలిసేట్టి అనురాధ గారికి ప్రత్యేక అభినందనలు.  

 

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com