యు. ఏ. ఈ. లో ‘తెలుగు పాఠ శాల’ప్రారంభోత్సవానికి ఆహ్వానం
- November 12, 2015
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో తెలుగు వెలుగును వికసింప చేయడానికి శ్రీమతి ఒబ్బిలిసేట్టి అనురాధ గారి కృషి ఫలితమైన ‘తెలుగు పాఠ శాల’ నవంబరు 14 నుండి ప్రారంభం కానుంది. నాలుగు లేదా ఆపై సంవత్సరాల వయసుగల చిన్నారులు ఇందులో చేరడానికి అర్హులు. ఈ కోర్సు పూర్తి అయిన తరువాత జరిగే పరీక్షలో ఉత్తీర్ణులయిన ఆరు సంవత్సరాల వయసు గల చిన్నారులకు పొట్టి శ్రీరాములు విశ్వ విద్యాలయం వారి నుండి ప్రమాణ పత్రం లభిస్తుంది. యు. ఏ. ఈ. అంతటా ఉన్న వీరి సెంటర్లలో, నెలకు రెండు తరగతులు జరుగుతాయి. మొదటగా సంస్థలో ఎన్ రోల్ చేసుకున్న 100 మంది చిన్నారులకు శిక్షణ ఉచితమని, ఆ తరువాతి వారికి సంవత్సరానికి 100 యు. ఏ. ఈ. డాలర్ల రుసుము ఉంటుందని శ్రీమతి అనురాధ తెలిపారు. సంస్థ ప్రారంభోత్సవానికి అందరు ఆహ్వానితులేనని, అంతే కాకుండా, ఆయా ప్రాంతాలలో బోధించడానికి, సమన్వయము చేయడానికి ఆసక్తి గల వారు తమను సంప్రదించాలని ఆమె కోరారు. మరి, మన చిన్నారులకు మన మాతృ భాషనూ నేర్పించడానికి మనం మన వంతు సహకారం అందించడమే ఆలస్యం!ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా డిప్యూటీ కౌన్సెల్ జనరల్ అనురాగ్ భూషణ్ గారు ,నేపాలీ ఎమ్బస్సడర్ ధనుంజయ్ జా గారు,ICWA కన్వీనర్ శ్రీ.కుమార్ గారు విచ్చేయనున్నారు.‘తెలుగు పాఠశాల’ కు సహాయ సహకారాలు అందించిన శ్రీ అజిత్ కుమార్ గారికి,శ్రీమతి ఒబ్బిలిసేట్టి అనురాధ గారు ప్రత్యేక అభినందనలు తెలిపారు.
‘తెలుగు పాఠశాల’ విజయవంతం అవ్వాలని ఆశిస్తున్నాము.మాగల్ఫ్.కామ్ తరపున శ్రీమతి ఒబ్బిలిసేట్టి అనురాధ గారికి ప్రత్యేక అభినందనలు.
తాజా వార్తలు
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- యూఏఈలోని ఇండియన్ సిలబస్ స్కూళ్లలో ఆన్లైన్లో ఎగ్జామ్స్..!!
- ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ పై 3 మిస్సైళ్లతో దాడికి యత్నం..!!









