కమల్‌ వాఖ్యలపై స్పందించిన మద్రాస్‌ హైకోర్టు

- November 24, 2017 , by Maagulf
కమల్‌ వాఖ్యలపై స్పందించిన మద్రాస్‌ హైకోర్టు

చెన్నై: హిందూ ఉగ్రవాదం ఉందంటూ ప్రముఖ నటుడు కమల్‌హాసన్‌ చేసిన వ్యాఖ్యలపై మద్రాస్‌ హైకోర్టు స్పందించింది. ఆయన వ్యాఖ్యల్లో విచారించదగిన అంశాలు ఉంటే కేసు నమోదు చేయాలని చెన్నై సిటీ పోలీసులను ఆదేశించింది. కమల్‌ హాసన్‌ హిందువులపై ఉగ్ర ముద్ర వేశారని, హిందువులకు వ్యతిరేకంగా విషాన్ని వ్యాపింపచేయాలని ప్రయత్నిస్తున్నారని పిటిషనర్‌ ఆరోపించారు. ఇటువంటి చర్యలను తక్షణమే ఆపాలని, నేడు హిందువులను ఉగ్రవాదులని అన్నారని, రేపు ఇతర మతాల వారిని కూడా అంటారని పిటిషనర్‌ పేర్కొన్నారు. దీనిపై స్పందించిన కోర్టు పై విధంగా స్పందించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com