ప్రపంచ ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ మైనపు మ్యూజియాన్ని న్యూఢిల్లీలో ప్రారంభించనున్నారు.

- November 13, 2015 , by Maagulf
ప్రపంచ ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ మైనపు మ్యూజియాన్ని న్యూఢిల్లీలో ప్రారంభించనున్నారు.

ప్రపంచ ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ మైనపు మ్యూజియాన్ని న్యూఢిల్లీలో ప్రారంభించనున్నారు. బ్రిటన్‌లో మోదీ పర్యటన సందర్భంగా భారత్‌లో టుస్సాడ్స్ శాఖ ఏర్పాటు అంశంపై చర్చలు జరిగాయి. 2017వ సంవత్సరాన్ని రెండు దేశాలు సాంస్కృతిక సంవత్సరంగా జరుపుకోవాలనుకుంటున్నాయి. లండన్‌లో ఉన్న టుస్సాడ్స్ మ్యూజియంలో బాలీవుడ్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, కత్రినా కైఫ్ మైనపు విగ్రహాలు ఉన్నాయి. 2017లో జరగనున్న సాంస్కృతిక ఉత్సవాల సందర్భంగా షేక్‌స్పియర్ రచనల తొలి ముద్రణతో పాటు బ్రిటీష్ మ్యూజియంలో ఉన్న పురాతన వస్తువులు, మ్యాగ్నా కార్ట్స్‌ను భారత్‌కు తీసుకురానున్నారు. అదే ఏడాదిలో బ్రిటన్‌లో ఇండియా ఫెస్టివల్‌ను కూడా ఏర్పాటు చేయనున్నట్లు డేవిడ్ కెమరూన్ తెలిపారు. 1714 నుంచి 1914 వరకు దక్షిణాసియాకు చెందిన రెండు లక్షల పేజీల చరిత్రను డిజిటైజ్ చేయాలని బ్రిటీష్ గ్రంధాలయం భావిస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com