జ్ఞాపకశక్తి పెంచే ఆహార పదార్థాలు
- November 13, 2015
ఉరుకుల పరుగుల జీవితం మనిషిపై ఒత్తిడి పెంచుతోంది. కారణంగా జ్ఞాపకశక్తి తగ్గిపోతోంది. ఒక దగ్గర పెట్టిన వస్తువును మరొక దగ్గర వెతుకుతూ ఉంటారు. దీనికి ఒత్తిడి, ఆందోళన ప్రధాన కారణాలు. అంతేకాదు.. యాంత్రిక జీవితంలో టెక్నాలజీపై ఎక్కువ ఆధారపడిపోవడంతో.. ఏది గుర్తుపెట్టుకోలేరు. పిల్లల్లో జ్ఞాపకశక్తి పెరగాలని కోరుకుంటున్నారా అయితే.. ఏం ఫర్వాలేదు.. ఇక్కడ చెప్పబోయే పద్ధతులు ఫాలో అవండి మంచి బెన్ఫిట్స్ పొందండి. జ్ఞాపకశక్తిని పెంచుకోవాలా..? అయితే ఇలా చేయండి...! నిద్రలేమి వల్ల కూడా జ్ఞాపకశక్తి చాలా తగ్గిపోతోంది. రాత్రంతా టీవీలు, ఫేస్ బుక్ లు, వాట్సాప్ లు, ఫ్రెండ్స్, సినిమాలు, షికార్లు ఇలా రకరకాల వ్యాపకాలతో.. లేటుగా నిద్రపోవడం అలవాటు చేసుకుంటున్నారు. దీనివల్ల జ్ఞాపకశక్తి తగ్గిపోతోంది. మీకే కాదు మీ పిల్లల్లోనూ జ్ఞాపకశక్తి సమస్య ఎక్కువగా ఉంటోంది. జ్ఞాపకశక్తి పెంచే ఆహార పదార్థాలే కాదు.. కొన్ని చిన్న చిట్కాలు ఫాలో అయినా.. మంచి ఫలితాలుంటాయి. క్యారెట్స్, క్యాలీ ఫవ్లర్ ను తీసుకుంటూ ఉండాలి. 50 నుంచి 60 గ్రాముల గోబీ, కొంచెం కొత్తిమీర తీసుకుని దానిపై కాస్త ఉప్పు, మిరియాలపొడి, నిమ్మకాయ కలుపుని ఉదయాన్నే అల్పాహారంగా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. భోజనం చేసిన తర్వాత ఒక గ్లాసు మజ్జిగ తీసుకోవాలి. మజ్జిగ తాగడం వల్ల శరీరానికి చలవ చేస్తుంది. దీనివల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. సో జ్ఞాపకశక్తి పెరగడానికి తోడ్పడుతుంది. పరీక్షల సమయంలో పిల్లలు ఎక్కువ సేపు చదువుకుంటూ ఉంటారు. రాత్రి పది గంటల తర్వాత కూడా చదువుతూ ఉంటారు. అలాంటప్పుడు ప్రతి అరగంటకొకసారి మంచి నీళ్లు తాగడం మంచిది. పడుకునే సమయంలో కూర్చుని చదుకుంటే మెదడుకు ఈజీగా చేరుతుంది. కానీ కొంతమంది బోర్లా పడుకుని, వంగి కూర్చుని చదువుకుంటూ ఉంటారు. ఇలా చదవడం వల్ల ప్రమాదం. నిటారుగా కూర్చుని చదివితే.. ఏకాగ్రత కుదురుతుంది. జ్ఞాపకశక్తి కూడా మెరగవుతుంది. ఎక్కువ సమయం చదువుతూ ఉన్నప్పుడు అలసటగా అనిపిస్తుంది. అలాంటప్పుడు రిలాక్స్ కోసం కాస్త అటూ ఇటూ తిరుగుతూ ఉండాలి. నిద్ర పోగొట్టుకోవడానికి టీ, సిగరెట్టు అలవాటు చేసుకోకూడదు. డైరీ ప్రోడక్ట్స్ లో క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది. క్యాల్షియం అధికంగా ఉండే పాలు, చీజ్, బట్టర్, పెరుగు మెదడు ఉత్సాహానికి తోడ్పడతాయి. ప్రత్యేకంగా పెరుగులో ఉండే ఎమినో యాసిడ్స్ మెమరీ పవర్ పెంచడానికి సహాయపడుతాయి. ఎగ్జామ్స్ దగ్గరపడ్డాయంటే.. ఒకేసారి గంటల తరబడి కూర్చుని చదివేస్తుంటారు చాలామంది విద్యార్థులు. ఇలా చేయడం వల్ల మెదడుపై ఒత్తిడి పెరిగి ఏది సరిగా గుర్తుండదు. కాబట్టి.. ఎప్పటికప్పుడు చదువుకోవడం మంచిది. లేదంటే.. చదువుకునేటప్పుడు అరగంటకోసారి విరామం ఇస్తే మైండ్ కి రిలాక్స్ గా ఉంటుంది
తాజా వార్తలు
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...







