మంత్రి కేటీఆర్‌తో అమెరికా రాయబారి భేటీ

- November 27, 2017 , by Maagulf
మంత్రి కేటీఆర్‌తో అమెరికా రాయబారి భేటీ

హైదరాబాద్‌: తెలంగాణ ఐటీ శాఖమంత్రి కేటీఆర్‌తో అమెరికా రాయబారి కెన్నత్‌ ఐ జుస్టర్‌ సమావేశమయ్యారు. అంతర్జాతీయ వాణిజ్య సదస్సు సందర్భంగా హైదరాబాద్‌కు విచ్చేసిన కెన్నత్‌కు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతోన్న కార్యక్రమాలను కేటీఆర్‌ వివరించారు. చేనేత దినం సందర్భంగా కెన్నత్‌కు పోచంపల్లి కండువా బహూకరించి జ్ఞాపికను అందజేశారు. అలాగే మంత్రి కేటీఆర్‌తో టీఐఈ గ్లోబల్‌ ఛైర్మన్‌ సుహాస్‌ పాటిల్‌ బృందంతో పాటు జీఈ దక్షిణాసియా అధ్యక్షుడు విశాల్‌ వాంఛూ కలిశారు. ఆరోగ్యం, విద్యుత్‌, ఏరోస్పేస్‌, రక్షణ రంగాల్లో పెట్టుబడుల అవకాశాలపై మంత్రితో చర్చించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com