షూలలో బంగారం బిస్కెట్లు
- November 27, 2017
చెన్నై విమానాశ్రమానికి అక్రమంగా తెచ్చిన రెండు కిలోల బంగారు బిస్కెట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన ఆదివారం చోటు చేసుకుంది. షార్జా నుంచి ఆదివారం సాయంత్రం తిరువనంతపురం మార్గంలో చెన్నైకి ఓ విమానం వచ్చింది. అందులో వచ్చిన ప్రయాణికులను అధికారులు క్షుణ్నంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తిరువనంతపురంలోని కోలికోడ్కు చెందిన ఇస్రాత్ (33) పట్టుబడ్డాడు. ఆయన ధరించిన షూలను తనిఖీ చేయగా రెండు కిలోల బంగారు బిస్కెట్లు బయటపడ్డాయి. ఆయన వాటిని షూలోని ప్రత్యేక అరలో అమర్చుకుని అక్రమంగా తరలించేందుకు యత్నించాడు. వీటి విలువ రూ.60 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. రెండు కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకుని, అతనిని అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.
తాజా వార్తలు
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు







