దేవిశ్రీ ఛార్మీల హాట్ న్యూస్ !
- May 01, 2015
ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఛార్మీల మధ్య ప్రేమ వ్యవహారం పై గతంలో చాల సార్లు మీడియాలో వార్తలు వచ్చాయి. వీరిద్దరూ కూడ గతంలో పబ్లిక్ ఫంక్షన్స్ లో కలిసినప్పుడు ఒకరి పై ఒకరు అభిమానాన్ని వ్యక్త పరుచుకుంటూ తమ స్నేహాన్ని చాటుకునే వారు. అంతేకాదు దేవిశ్రీ ప్రసాద్ స్టేజ్ షోలు చేస్తున్నప్పుడు ఛార్మీ మొదటి వరసలో కూర్చుని అభిమానులతో సమానంగా హడావిడి చేస్తూ ఈలలు వేస్తూ దేవిశ్రీ ప్రసాద్ కు తన వంతు జోష్ ను అందించేది. అయితే ఈ మధ్య కాలంలో వీరిద్దరి స్నేహబంధానికి సంబంధించిన వార్తలు బాగా తగ్గాయి. ఈ నేపధ్యంలో అనుకోని విధంగా ఊహించని ట్విస్ట్ ఇస్తూ దేవిశ్రీ ప్రసాద్ ఛార్మీని ఆకాశంలోకి ఎత్తేస్తూ పెట్టిన ట్విట్ ఇప్పుడు టాపిక్ ఆఫ్ టాలీవుడ్ గా మారింది . దేవిశ్రీ ప్రసాద్ ఛార్మీని ఆకాశంలోకి ఎత్తేస్తూ పెట్టిన ట్విట్ ఛార్మీ ప్రస్తుతం నటిస్తున్న 'జ్యోతిలక్ష్మి' సినిమా 37 రోజులలో షూటింగ్ పూర్తి అయిన విషయాన్ని ప్రస్తావిస్తూ దర్శకుడు పూరీని హీరోయిన్ ఛార్మీని అభినందిస్తూ 'మీరిద్దరూ ఆదరగొడుతున్నారు' అంటూ పెట్టిన ట్విట్ తో తిరిగి ఛార్మీ దేవిశ్రీల మధ్య స్నేహం మళ్ళీ మొదలైందా? అంటూ ఫిలింనగర్ లో వార్తల గాసిప్పులు వినపడుతున్నాయి. ఛార్మీ తన లుక్ ను పూర్తిగా మార్చుకుని 'జ్యోతిలక్ష్మి' ద్వారా తిరిగి తన హవాను టాలీవుడ్ లో ప్రారంభించాలి అని ఆశ పడుతున్న నేపధ్యంలో దేవిశ్రీ లేటెస్ట్ ట్విట్ ఛార్మీకి మంచి జోష్ కలిగిస్తుంది అని అనడంలో ఎటువంటి సందేహంలేదు..
తాజా వార్తలు
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!







