దేవిశ్రీ ఛార్మీల హాట్ న్యూస్ !
- May 01, 2015
ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఛార్మీల మధ్య ప్రేమ వ్యవహారం పై గతంలో చాల సార్లు మీడియాలో వార్తలు వచ్చాయి. వీరిద్దరూ కూడ గతంలో పబ్లిక్ ఫంక్షన్స్ లో కలిసినప్పుడు ఒకరి పై ఒకరు అభిమానాన్ని వ్యక్త పరుచుకుంటూ తమ స్నేహాన్ని చాటుకునే వారు. అంతేకాదు దేవిశ్రీ ప్రసాద్ స్టేజ్ షోలు చేస్తున్నప్పుడు ఛార్మీ మొదటి వరసలో కూర్చుని అభిమానులతో సమానంగా హడావిడి చేస్తూ ఈలలు వేస్తూ దేవిశ్రీ ప్రసాద్ కు తన వంతు జోష్ ను అందించేది. అయితే ఈ మధ్య కాలంలో వీరిద్దరి స్నేహబంధానికి సంబంధించిన వార్తలు బాగా తగ్గాయి. ఈ నేపధ్యంలో అనుకోని విధంగా ఊహించని ట్విస్ట్ ఇస్తూ దేవిశ్రీ ప్రసాద్ ఛార్మీని ఆకాశంలోకి ఎత్తేస్తూ పెట్టిన ట్విట్ ఇప్పుడు టాపిక్ ఆఫ్ టాలీవుడ్ గా మారింది . దేవిశ్రీ ప్రసాద్ ఛార్మీని ఆకాశంలోకి ఎత్తేస్తూ పెట్టిన ట్విట్ ఛార్మీ ప్రస్తుతం నటిస్తున్న 'జ్యోతిలక్ష్మి' సినిమా 37 రోజులలో షూటింగ్ పూర్తి అయిన విషయాన్ని ప్రస్తావిస్తూ దర్శకుడు పూరీని హీరోయిన్ ఛార్మీని అభినందిస్తూ 'మీరిద్దరూ ఆదరగొడుతున్నారు' అంటూ పెట్టిన ట్విట్ తో తిరిగి ఛార్మీ దేవిశ్రీల మధ్య స్నేహం మళ్ళీ మొదలైందా? అంటూ ఫిలింనగర్ లో వార్తల గాసిప్పులు వినపడుతున్నాయి. ఛార్మీ తన లుక్ ను పూర్తిగా మార్చుకుని 'జ్యోతిలక్ష్మి' ద్వారా తిరిగి తన హవాను టాలీవుడ్ లో ప్రారంభించాలి అని ఆశ పడుతున్న నేపధ్యంలో దేవిశ్రీ లేటెస్ట్ ట్విట్ ఛార్మీకి మంచి జోష్ కలిగిస్తుంది అని అనడంలో ఎటువంటి సందేహంలేదు..
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం









