మెట్రో: జీహెచ్ఎంసీకి ఘోర పరాభవం
- November 28, 2017
జీహెచ్ఎంసీకి మెట్రో అధికారులు షాకిచ్చారు. హైదరాబాద్లో ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన మెట్రోరైలు ప్రాజెక్ట్లో కొన్ని అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. మెట్రో తొలిదశకు సంబంధించి ఏర్పాటు చేసిన శిలాఫలకం మీద మేయర్ పేరు మచ్చుకైనా కనిపించలేదు. ప్రారంభకులుగా ప్రధాని మోదీ, గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్ పేర్లు మాత్రమే స్పష్టంగా వున్నాయి. ఇక కేంద్ర సహాయమంత్రి హరదీప్ సింగ్ పూరీ, తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పేర్లు కూడా వున్నాయి. కాకపోతే నగరానికి ప్రథమ పౌరుడు బొంతు రామ్మోహన్ పేరు లేకపోవడం గమనార్హం.
ఇదిలావుంటే.. ప్రధాని మోదీతో కలిసి మెట్రోలో ప్రయాణించే వీఐపీల జాబితాలో జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్థన్రెడ్డి పేరు గల్లంతైంది. మెట్రో ప్రాజెక్ట్కి చేదోడువాదోడుగా వుంటూ నిర్మాణ పనుల్లో సహకరించిన జీహెచ్ఎంసీ కమిషనర్ని పూచికపుల్లగా తీసిపడేయడం విమర్శలకు తావిస్తోంది. కానీ, ప్రోటోకాల్ నిబంధనల ప్రకారమే తాము వ్యవహరించినట్టు అధికారులు చెబుతున్నారు.

తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







