సదస్సుకు ఆతిథ్యం ఇవ్వడం ఆనందంగా ఉంది

- November 28, 2017 , by Maagulf
సదస్సుకు ఆతిథ్యం ఇవ్వడం ఆనందంగా ఉంది

అంగరంగ వైభవంగా 2017 అంతర్జాతీయ వ్యాపారవేత్తల సదస్సు ప్రారంభమైంది. ఈ సదస్సు ను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సదస్సును ప్రారంభించారు. 127 దేశాల నుంచి దాదాపు 15 వందల మంది ఎంట్రప్రెన్యూర్స్ ఈ సదస్సులో పాల్గొన్నారు. భారత, అమెరికా ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ సదస్సు మూడ్రోజులపాటు జరగనుంది. హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో సర్వాంగ సుందరంగా వేదికను తీర్చిదిద్దారు. ఈ సదస్సులో ప్రారంభోపన్యాసం ను తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ ఇచ్చారు. ఈ సదస్సుకు ఆతిథ్యం ఇస్తుండడం ఆనందంగా ఉందని అన్నారు. హైదరాబాద్‌ వేగంగా నడుస్తున్న నగరం అని.. తెలంగాణలో వ్యాపార అనుమతులకు సింగిల్‌ విండో విధానం అమలులో ఉన్నట్లు కేసీఆర్ చెప్పారు. 15 రోజుల్లో పరిశ్రమలకు అనుమతులు ఇస్తున్నామని.. అంకుర సంస్థలకు కావాల్సిన అన్ని వసతులు కల్పిస్తున్నట్లు కేసీఆర్‌ చెప్పారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com