యూఏఈ నేషనల్ డే: ఉల్లంఘనకు 2,000 దిర్హామ్ల జరీమానా
- November 28, 2017
యూఏఈ: యూఏఈ నేషనల్ డే సందర్భంగా ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడితే 2,000 దిర్హామ్ల వరకు జరీమానా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రముఖ స్ట్రీట్స్లో ప్రత్యేక పెట్రోల్ వాహనాల్ని ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. బుర్ దుబాయ్, జుమైరా స్ట్రీట్, అల్ సుఫోహ్ స్ట్రీట్, జిబిఆర్ వంటి ప్రాంతాల్లో పెట్రోల్ వాహనాలు మోహరిస్తున్నారు. డేడ్రా, అల్ మురాక్కాబాత్, అల్ రక్కా, అల్ మంజార్, రషిదియా, అల్ ఖలీజ్ స్ట్రీట్, అల్ ఇత్తిహాద్ స్ట్రీట్, అమ్మాన్ స్ట్రీట్, యూనివర్సిటీ సిటీ ప్రాంతాల్లోనూ ఏర్పాటు చేస్తున్నారు. ఇతరుల ప్రాణాలకు ముప్పు కలిగేలా వాహనాల్ని నడపడాన్ని సీరియస్గా పరిగణిస్తామని అధికారులు చెప్పారు. రోడ్లపైన వాహనాల్ని నిలిపివేయడం, వాహనాలతో శబ్ద కాలుష్యం అతిగా చేయడం వంటివాటికి కఠిన చర్యలుంటాయి. 6 నుంచి 23 బ్లాక్ పాయింట్స్ వరకూ ఆయా నేరాలకు వర్తిస్తాయి. అలాగే జరీమానాలు 1,000 దిర్హామ్ నుంచి 2,000 దిర్హామ్ వరకు జరీమానా తప్పదు. వాహనాల జప్తు 60 రోజుల వరకు ఉంటుంది.
తాజా వార్తలు
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...







