తొలి మహిళగా రికార్డ్: లోకసభ సెక్రటరీ జనరల్గా స్నేహలత
- November 29, 2017
న్యూఢిల్లీ: ఐఏఎస్ అధికారి స్నేహలత శ్రీవాత్సవను లోకసభ నూతన జనరల్ సెక్రటరీగా నియమిస్తూ సెక్రటేరియట్ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు ఈ పదవిలో నియమితులైన మొదటి మహిళగా స్నేహలత రికార్డుల్లోకెక్కారు.
స్నేహలత డిసెంబర్ 1న బాధ్యతలు తీసుకుని, నవంబర్ 30, 2018 వరకు పదవిలో కొనసాగనున్నారు. ప్రస్తుతం జనరల్ సెక్రటరీ వ్యవహారాలను చూస్తున్న అనూప్ మిశ్రా నుంచి ఆమె బాధ్యతలు స్వీకరించనున్నారు.
1982 మధ్యప్రదేశ్ ఐఏఎస్ కేడర్కి చెందిన స్నేహలత.. గతంలో న్యాయ, ఆర్థిక మంత్రిత్వ శాఖల్లో పనిచేశారు. రాజ్యసభ మహిళా సెక్రటరీ జనరల్గా రమాదేవి ఇప్పటికే రికార్డుల్లోకి ఎక్కారు.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







