నిమిషాల్లోనే ద.కొరియా క్షిపణి ప్రయోగం!
- November 29, 2017
సియోల్: ఉత్తరకొరియా విధ్వంసక ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి(ఐసీబీఎం)ను బుధవారం ప్రయోగించిన సంగతి తెలిసిందే. అయితే ఉ.కొరియా ఈ క్షిపణిని ప్రయోగించిన కొద్ది నిమిషాల్లోనే దక్షిణ కొరియా కూడా క్షిపణిని ప్రయోగించింది. ఉ.కొరియాకు దీటుగా సమాధానం చెప్పడానికే ఈ క్షిపణిని ప్రయోగించినట్లు ద.కొరియా రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి.
రాజధాని సియోల్ మీదుగా ఈ క్షిపణిని ప్రయోగించినట్లు ద.కొరియా పేర్కొంది. ఉ.కొరియా చేపట్టే ప్రయోగాలు త్వరలో మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశం ఉందని ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్న సంగతి తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉ.కొరియాను ఉగ్రదేశంగా ప్రకటించిన నేపథ్యంలో ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ యున్ ఈ బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించారు.
ఈ విషయమై ట్రంప్.. జపాన్ ప్రధాని షింజో అబే, ద.కొరియా అధ్యక్షుడు మూన్ జేఇన్లతో అత్యవసరంగా ఫోన్లో విడివిడిగా చర్చలు జరిపారు. మరోవైపు జపాన్ అభ్యర్థనపై ఐరాస భద్రతా మండలి(యూఎన్ఎస్సీ) అత్యవసరంగా సమావేశం అయ్యేందుకు అంగీకరించింది.
తాజా వార్తలు
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు ఘటన..ఖండించిన కువైట్..!!
- అజర్బైజాన్లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!









