నిమిషాల్లోనే ద.కొరియా క్షిపణి ప్రయోగం!
- November 29, 2017
సియోల్: ఉత్తరకొరియా విధ్వంసక ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి(ఐసీబీఎం)ను బుధవారం ప్రయోగించిన సంగతి తెలిసిందే. అయితే ఉ.కొరియా ఈ క్షిపణిని ప్రయోగించిన కొద్ది నిమిషాల్లోనే దక్షిణ కొరియా కూడా క్షిపణిని ప్రయోగించింది. ఉ.కొరియాకు దీటుగా సమాధానం చెప్పడానికే ఈ క్షిపణిని ప్రయోగించినట్లు ద.కొరియా రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి.
రాజధాని సియోల్ మీదుగా ఈ క్షిపణిని ప్రయోగించినట్లు ద.కొరియా పేర్కొంది. ఉ.కొరియా చేపట్టే ప్రయోగాలు త్వరలో మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశం ఉందని ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్న సంగతి తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉ.కొరియాను ఉగ్రదేశంగా ప్రకటించిన నేపథ్యంలో ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ యున్ ఈ బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించారు.
ఈ విషయమై ట్రంప్.. జపాన్ ప్రధాని షింజో అబే, ద.కొరియా అధ్యక్షుడు మూన్ జేఇన్లతో అత్యవసరంగా ఫోన్లో విడివిడిగా చర్చలు జరిపారు. మరోవైపు జపాన్ అభ్యర్థనపై ఐరాస భద్రతా మండలి(యూఎన్ఎస్సీ) అత్యవసరంగా సమావేశం అయ్యేందుకు అంగీకరించింది.
తాజా వార్తలు
- ఇరాన్ నుండి నష్టపరిహారం ఇప్పించండి: బహ్రెయిన్
- 10% వరకు పెరగనున్న విమాన ఛార్జీలు..!!
- కువైట్ లో రెండు రోజులపాటు భారీ వర్షాలు..!!
- సౌదీలో చట్టాలను ఉల్లంఘించిన 14,487 మంది అరెస్టు..!!
- ఇజ్రాయెల్ చర్యను ఖండించిన ఒమన్ సహా 14 దేశాలు..!!
- ఖతార్ లో అడ్మిషన్లు..20 ఇ-సేవలు ఆవిష్కరణ..!!
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!









