'డల్లాస్'లో ఇండియన్ బాలిక హత్య...
- November 30, 2017
ఒక అనాథాశ్రమం నుంచి బాలికను సాకుతామని తీసుకువచ్చి ఆమెను అత్యంత పైశాచికంగా హత్య చేసి అమెరికా సంయుక్త రాష్ట్రాలలో డల్లాస్ లోని ఓ కల్వర్టు కింద పారవేసినట్లు ఓ జంట ఆరోపణలు ఎదుర్కొంటోంది. వివరాలను చూస్తే గత అక్టోబరు నెలలో మూడేళ్ల తమ పెంపుడు కుమార్తె షెరీన్ మాథ్యూస్ బాలిక తమకు కనిపించడంలేదంటూ అన్ మాథ్యూస్, ఆమె భర్త వెస్లీ మాథ్యూస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరిద్దరూ భారత సంతతి(కేరళ)కి చెందినవారు.
వంట గదిలో ఆమెను వదిలేసి తాము విధులకు వెళ్లామనీ, తిరిగి వచ్చేసరికి ఆమె కనిపించలేదని చెప్పారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు డల్లాస్ లోని ఓ కల్వర్టులో బాలిక మృత దేహాన్ని కనుగొన్నారు. బాలిక శవానికి పోస్టుమార్టం నిర్వహించగా అందులో బాలికపై దాడి జరిగినట్లు తేలింది.
తొడ ఎముక, మోకాలి కింది ఎముక విరిగిపోయి వున్నాయి. ఇంకా శరీరంలో చాలాచోట్ల ఎముకలు విరిగిన ఆనవాళ్లు కనిపించాయి. దీనితో సదరు జంటను పోలీసులు విచారించగా వారు మాత్రం తాము బాలికను వంట గదిలో వదిలేసి వెళ్లామని చెప్పారు. కానీ పోలీసులు మాత్రం బాలిక మృతికి వీరిద్దరే కారణమని అరెస్టు చేశారు. మరోవైపు పోస్టుమార్టం రిపోర్టులో బాలికపై దాడి జరిగినట్లు వైద్యులు చెపుతున్నారు. ఐతే కోర్టులో ఈ జంట తరపున వాదనలు చేసిన న్యాయవాది బలమైన వాదన వినిపించారు. దీనితో కట్టాల్సిన జరిమానాలో తగ్గింపు చేశారు. అలాగే శిక్ష కూడా తగ్గే అవకాశం వున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







