బంగళాఖాతంలో వాయుగుండం..
- November 30, 2017
తమిళనాడును మరోసారి భారీ వర్షాలు వణికిస్తున్నాయి. ముఖ్యంగా చెన్నై నగరం వర్ష బీభత్సానికి చిగురుటాకులా వణుకుతోంది. నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో జనం హడలిపోతున్నారు. చెన్నై శివారులోని.. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. చుట్టూ కమ్మేసిన వాన నీటిని దాటుకుని.. బయటకు వచ్చేందుకు జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటు రోడ్లన్ని జలమయం కావడంతో.. వాహన దారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నాయి. బుధవారం ఆగ్నేయ బంగాళాఖాతంలో తమిళనాడు, శ్రీలంకను ఆనుకుని మరో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చేరిలలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ వివరించింది. సముద్రంలో ప్రస్తుతం గాలులు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయని, చేపల వేటకు సముద్రంలోకి వెళ్లొద్దని హెచ్చరించింది.
నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా మరికొద్ది రోజులు వానలు కురుస్తాయన్న వాతావరణశాఖ హెచ్చరికలతో.. అధికారులు అప్రమత్తమయ్యారు. వర్షాల కారణంగా ఏడు జిల్లాల్లోని స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు. చెన్నై, కాంచీపురం, తిరువల్లూరు జిల్లాల్లో సెలవుల మీద వెళ్లిన రెవెన్యూ శాఖ, పురపాలక శాఖ అధికారులు, సిబ్బంది వెంటనే విధులకు హాజరు కావాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







